China: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ..

చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్‌లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. 

New Update
Dating Secrets: ఫస్ట్ డేట్‌‌లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులివే!

తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా చైనా.. ప్రజలకు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇటీవల ఓ కంపెనీ డేటింగ్‌కి వెళ్తే డబ్బులిస్తామనే సరికొత్త ప్రకటన చేసింది. కంపెనీలో వర్క్ చేస్తున్న సింగిల్స్ అందరూ కూడా డేటింగ్ చేసేలా డిఫరెంట్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో వారు డేటింగ్‌కి వెళ్తే.. డబ్బును బహుమతిగా ఇస్తామని ఓ టెక్ కంపెనీ ప్రకటించింది.

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

జనాభాను పెంచేందుకు డేటింగ్ కాంటాస్ట్..

ఈ డేటింగ్ కాంటాస్ట్‌లో కంపెనీలో వర్క్ చేసే సింగిల్స్ అందరూ ఇతరులు ఆకర్షితులు అయ్యే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాలి. ఇలా పోస్ట్‌లు చేయడం వల్ల వారికి 66 యువాన్లు అనగా భారత కరెన్సీలో రూ.770 ఇస్తారు. పోస్ట్ చేసిన తర్వాత మూడు నెలల పాటు ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తే ఒక్కోరికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. 

ఇది కూడా చూడండి:  తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

ప్రపంచంలో చైనాలోనే ఎక్కువ జనాభా ఉండేవారు. కానీ ఇప్పుడు యువత పెళ్లికి నిరాకరించడంతో రోజురోజుకీ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో యువతను ఆకర్షించడానికి కొత్త కొత్త స్కీమ్‌లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ కంపెనీలు సింగిల్‌గా ఉన్న వారికి ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తుంది.  

ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

ఈ ఆఫర్లకు యువత అట్రాక్ట్ అయి డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా రావచ్చు. దీనివల్ల చైనాలో జనాభా పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా పలు కంపెనీలు కూడా యువతను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది.

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire Accident in america : అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
Fire Accident  in america

Fire Accident in america

Fire Accident  in america : అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అపార్టుమెంట్లలో ఉన్న పది మంది విద్యార్థులను రక్షించారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

బాధితులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులని పేర్కొన్నాయి. వారు అలబామా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారని తెలిపాయి. అపార్టుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించాయి. శనివారం సాయంత్రం 6.20 గంటలకు బిల్డింగ్‌లో మంటలు వ్యాపించాయని బాధితుల్లో ఒకరు ఇన్‌స్టా పోస్టు ద్వారా వెల్లడించారు.

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, వేగంగా అపార్టుమెంట్‌ మొత్తం వ్యాపించాయని తెలిపారు. అందరం వెనుక డోర్‌ నుంచి బయటకు వచ్చేశామని, కానీ ఒకరు మాత్రం పొగలు దట్టంగా అలముకోవడంతో అందులో చిక్కుకుపోయాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగానే ఉన్నదని అందులో తెలిపారు. అగ్నిప్రమాదం నుంచి తాము బయటపడటం చాలా గొప్పవిషయమని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Advertisment
Advertisment
Advertisment