Morocco: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?

పశ్చిమ ఆఫ్రికా మౌరిటానియా నుంచి 86 మంది వలసదారులతో స్పెయిన్‌ బయలుదేరిన పడవ మొరాకో సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 50 మంది నీటిలో గల్లంతు కాగా, 36 మందిని కాపాడినట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో 40 మందికి పైగా పాక్‌ పౌరులు ఉన్నట్లుగా సమాచారం.

New Update
Morocco ship incident

Morocco ship incident

Morocco: పశ్చిమ ఆఫ్రికా మౌరిటానియా నుంచి 86 మంది వలసదారులతో బయలుదేరిన పడవ ఘోర ప్రమాదానికి గురైంది. మొరాకో (Morocco) లోని దఖ్లా నౌకాశ్రయం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 మంది నీటిలో గల్లంతు కాగా..  36 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 44 మంది పాక్‌ పౌరులు ఉన్నట్లుగా సమాచారం. అయితే పడవలో ప్రయాణించిన 86 మంది వలసదారుల్లో పాకిస్థాన్‌ (Pakistan) కు చెందినవారే 66 మంది కంటే ఎక్కువ ఉన్నారు. వివరాల ప్రకారం, పడవలో 50పైగా మందిని  అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. అందులో పాకిస్తాన్‌ జాతీయులు కూడా ఉన్నారు. వెస్ట్రన్ ఆఫ్రికా ద్వారా స్పెయిన్‌ కెనరీ ద్వీపాలకు వారిని అక్రమంగా తీసుకెళ్తుండగా  పడవ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 
 

Also Read :  నాంపల్లి నుమాయిష్ లో తప్పిన పెను ప్రమాదం.. తలకిందులుగా ఇరుక్కుపోయిన జనం

స్పందించిన పాక్ ప్రధాని 

ఈ ఘటన పై  స్పందించిన  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. మానవ అక్రమ రవాణా చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు  అలాగే  ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. మొరాకో తీరంలో పడవ బోల్తా పడింది. ఇందులో అనేక మంది పాకిస్థానీయులతో సహా 80 మందికి పైగా ప్రయాణికులను ప్రమాదానికి గురవడం మొత్తం దేశాన్ని షాక్‌కి గురి చేసింది అని  PM షరీఫ్ ఎక్స్‌లో రాశారు. అలాగే ఈ ప్రమాదంలో  తప్పిపోయిన వారిని గుర్తించడానికి, ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించడానికి,  ఈ ప్రాణాలు కోల్పోయిన వారి అవశేషాలను తిరిగి తీసుకురావడానికి  తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాదకరమైన ఉచ్చులోకి అమాయక పౌరులను ఆకర్షించే పాకిస్తాన్‌లోని మానవ అక్రమ రవాణాదారులు ఏజెంట్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

Also Read :  కాల్పుల విరమణ తర్వాత కూడా ఇంకా దాడులు ..100 మంది మృతి!

Also Read :   Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zelensky: క్రిమియాపై ఉక్రెయిన్‌ సంచలన కామెంట్స్‌..

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని పేర్కొంది.

New Update
Zelensky

Zelensky

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇకనుంచి క్రిమియా రష్యాతోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. అమెరికా శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని చెప్పడం షాక్‌కు గురిచేసిందని తెలిపింది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

Ukraine Comments On Crimea

క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని జెలెన్‌స్కీ పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్‌ మెరెజ్ఖో తెలిపారు. రష్యాను క్రిమియా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని.. దాన్ని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమన్నారు. ఇందుకోసం తమ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాలని.. అలాగే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

క్రిమియాను వదులుకోవడం అంటే తమ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని తెలిపారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా భావిస్తామన్నారు. ఇదిలాఉండగా. దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట క్రిమియా ప్రాంతం ఉంది. అయితే 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!

telugu-news | rtv-news | russia-ukraine | zelensky | trump 

Advertisment
Advertisment
Advertisment