Bangladesh: బంగ్లాదేశ్‌లో లాక్‌డౌన్.. ఆఫీసు, షాపుల పనివేళల్లో మార్పులు

దేశీయ ఇంధన అవసరాల కోసం బంగ్లాదేశ్‌ 95 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం అక్కడ ముంచుకొస్తున్న విద్యుత్, చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.

New Update
Bangladesh cuts working hours to save energy amid Middle East crisis

Bangladesh cuts working hours to save energy amid Middle East crisis

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇంటర్నేషనల్ ఇంధన మార్కెట్‌లను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దీంతో వీటి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే బంగ్లాదేశ్‌పై భారీగా ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి దేశీయ ఇంధన అవసరాల కోసం బంగ్లాదేశ్‌ 95 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం అక్కడ ముంచుకొస్తున్న విద్యుత్, చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.

దేశంలో విద్యుత్‌ వినియోగాన్ని పొదుపు చేసేందుకు ఆఫీసుల పనివేళల్లో మార్పులు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పని చేయాలని ఆదేశించింది. అలాగే బ్యాంకింగ్ సేవలు కూడా మధ్యాహ్నం 3 గంటలకే ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు వాణిజ్య వర్గాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. షాపింగ్ మాల్స్, మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని రూల్స్ విధించింది. అత్యవసర సేవలైన వైద్యం, ఆహార విక్రయ కేంద్రాలను మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. 

Also read: నేనేం తప్పు చేశాను.. పార్టీ నుంచి తొలగించాక రాఘవ్ చడ్డా సంచలన వ్యాఖ్యలు

ప్రజలపై మాత్రమే కాకుండా.. ప్రభుత్వ యంత్రాంగంపై కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధనం,  విద్యుత్ బడ్జెట్‌లో వెంటనే 30 శాతం కోత విధిస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటన చేసింది. ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కొత్త వాహనాలు, విమానాలు లేదా నౌకల కొనుగోలుపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే బహిరంగ వేడుకల్లో అలంకరణ విద్యుత్ దీపాల వాడకూడదని చెప్పింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని తగ్గించుకోవడంతో పాటు.. అందుబాటులో ఉన్న వనరులను అత్యవసర సేవలకు మాత్రమే మళ్లించాలని టార్గెట్‌ పెట్టుకుంది. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్ సంస్థల నుంచి 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరుతోంది. అలాగే తక్షణ ఇంధన అవసరాల కోసం భారత్‌ వైపు చూస్తోంది. అయితే బంగ్లాదేశ్‌ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన భారత్.. ఇప్పటికే స్నేహపూర్వకంగా 5,000 టన్నుల అదనపు డీజిల్‌ను సరఫరా చేసింది. కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాక మాల్దీవులు, శ్రీలంక లాంటి దేశాలకు కూడా ఇంధన భద్రత కోసం భారత్ వైపు చూస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత ప్రభావితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Also Read: CA నుంచి రాజ్యసభ దాకా: ఆప్ ఎంపీ ఆస్తుల లెక్క ఎంతంటే?

Advertisment
తాజా కథనాలు