Myanmar Earthquake: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడం కలకలం రేపుతోంది.నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ భవనం కూలిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ఆర్తనాదాలు చేసిన ఓ వీడియో వైరలవుతోంది.

New Update
Earthquake in Bangkok

Earthquake in Bangkok

Myanmar Earthquake: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో(Bangkok) భారీ భూకంపం సంభవించడం కలకలం రేపుతోంది. భూ ప్రకంపనాల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవనం కూలిన ఘటనలో 7 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో 43 మంది కార్మికులు శిథిలాల కిందే చిక్కుకున్నట్లు అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

Also Read: BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ..!

ఆ భవనం కూలిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ఆర్తనాదాలు చేసిన వీడియో బయటికొచ్చింది. కాపాడండి ప్లీజ్ అంటూ అతడు వాపోయిన దృశ్యాలు చూపరులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు భూకంపాల ధాటికి థాయ్‌లాండ్ ప్రభుత్వం.. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ప్రకటించింది. 

Also Read: విల్లాస్‌లో హై ప్రొఫైల్ శృంగార క్రీడ.. కానిస్టేబుల్ కస్టమర్‌గా వెళ్లడంతో గుట్టు రట్టు!

సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా సిటీకి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలోని మయన్మార్‌లో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీని ప్రభావంతోనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  బ్యాంకాక్‌లో భూ ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. భూకంప ప్రభావంతో వందలాది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 15 మృతదేహాలు లభ్యమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire Accident : టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం...17 కార్లు దగ్ధం.. వారి పనే అంటున్న మస్క్

ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

New Update
Fire At Tesla Dealership

Fire At Tesla Dealership

Fire Accident: ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇటలీలోని రోమ్ నగర శివార్లలోని టెస్లా షోరూంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.షార్ట్‌ సర్య్కూట్‌ లేదా ఇతర కారణాలతో  షోరూం అంతా కాలిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 17 కార్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే ఉదయం 4.30 గంటలకు మంటలు అంటుకున్నాయని.. అదృష్ట వశాత్తు షోరూంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

అయితే ఈ విషయం తెలుసుకున్న మస్క్ తాజాగా స్పందించారు. ఇది కావాలనే ఉగ్రవాదులు చేశారని ఆరోపించారు. తమ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తోందని.. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని సైతం దీనిపై స్పందించి మస్క్‌కు మద్దతు తెలిపారు. టెస్లా కంపెనీపై కావాలని దాడులు చేయడం దారుణం అన్నారు. ఇకనైనా ఈ దాడులు ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.. దీంతో వారికి అనేక మంది శత్రువులవుతున్నారు. ఈక్రమంలోనే స్థానిక ప్రజల నుంచి ఉగ్రవాదుల వరకు వీరిపై కోపంగా ఉన్నారు. అందుకే పగ తీర్చుకోవాలని ఎలాన్ మస్క్ కంపెనీపై దాడులు చేస్తున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ దాడులు సాగుతున్నాయి. ఇటీవలే ట్రంప్ సైతం దీనిపై స్పందించి.. టెస్లా కార్లపై దాడికి పాల్పడితే 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

Advertisment
Advertisment
Advertisment