Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం !

మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.

New Update
Earthquake in Myanmar

Earthquake in Myanmar

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. యూనైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే ఈ భకంప తీవ్రతను 5.1గా పేర్కొంది. మయన్మార్ రాజధాని నేపిడాకి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. 

Also Read: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ

ఇదిలాఉండగా.. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో  అక్కడ 7.7, 6.4 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చింది. అనేక భవనాలు ఊగిపోయాయి. మరికొన్ని నెలకొన్నాయి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల్లో భూకంపం ధాటికి ఇప్పటిదాకా 1000 మందికి పైగా మృతి చెందారు. 

Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి

మరోవైపు మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాల ముందుకొస్తున్నాయి. ఇప్పటికే భారత్‌.. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, టెంట్లు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయం చేస్తామని ప్రకటించాయి. అలాగే మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహాయక సామగ్రిని  పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియోగుటెరస్ తెలిపారు. 

 telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

ఫోర్బ్స్ బిలియనీర్ 2025 జాబితా విడుదలైంది. 342 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ మొదటిస్థానంలో ఉన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10లో ఉన్న అంబానీ, ఈసారి 18వ స్థానానికి పడిపోయాడు. అదానీ 28వ ప్లేస్‌లో ఉన్నారు.

New Update
Forbes Billionaires List_ 2025

Forbes Billionaires List_ 2025 Photograph: (Forbes Billionaires List_ 2025)

ఫోర్బ్స్ బిలియ‌నీర్ల 2025 జాబితా విడుదలైంది. గతేడాది టాప్ 10లో ఉన్న భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. భారీగా ఆయన ఆస్తులు తగ్గి ఆ ప్లేస్ నుంచి మాయమైపోయాడు. 2025 జాబితా ప్రకారం ప్రపంచంలో 3,028 మంది బిలియనీర్లు ఉన్నారు. 2024 కంటే 247 మంది బిలియనీర్లు ఈఏడాది పెరిగారు. ఈ బిలియనీర్ల మొత్తం సంపద 16.1 ట్రిలియన్ డాలర్లు. ఇది 2024 కంటే దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఎక్కువ. 2025 ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో 902 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనాలో 516 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక భారతదేశం 205 మంది కుబేరులు ఉన్నారు. ఈ ఫోర్బ్స్ లిస్ట్‌లో ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన నికర ఆస్తుల విలువ 342 బిలియన్ల డాలర్లు. మెటా కంపెనీ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్ 216 బిలియన్ల డాలర్లు సంపదతో 2వ స్థానంలో ఉన్నాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 3వ ప్లేస్‌లో, ఒరాకిల్‌ యజమాని లారీ ఎల్లిసన్‌ నాల్గవ స్థానం దక్కించుకున్నారు.

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

Also read : Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

ఇక భారత్ విషయానికి వస్తే.. గత సంవత్సరం టాప్ 10లో ఉన్న అంబానీ, ఇప్పుడు 92.5 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు. అంబానీ నికర సంపద విలువ గత సంవత్సరం 116 బిలియన్ డాలర్లు ఉండగా.. 2025లో 92.5 బిలియన్ డాలర్లుకు పడిపోయింది, భార‌తీయ బిలియ‌నీర్ల మొత్తం ఆస్తుల విలువ 941 బిలియ‌న్ల డాల‌ర్లు. గ‌త ఏడాదితో పోలిస్తే ఇది త‌గ్గింది. మరో ఇండియన్ కుబేరుడు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 28వస్థానం దక్కించుకున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 56.3 బిలియన్ డాలర్లు. ఇండియాలో అత్యంత రిచెస్ట్ ఉమెన్‌గా సావిత్రి జిందాల్ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆమె 56వ స్థానంలో ఉన్నారు. OP జిందాల్ గ్రూప్ ఓనర్‌గా ఆమెకు 35.5 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఆమె ప్రపంచంలోనే ఆరవ అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచింది.

Advertisment
Advertisment
Advertisment