Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

ఇంటర్వ్యూ కోసం ఏకంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో కే మెయిల్ చేశాడో యూట్యూబర్‌. కేవలం నాలుగు నిమిషాల్లోనే సత్య నాదెళ్ల అతనికి మెయిల్‌ ద్వారానే సమాధానం ఇచ్చారు. కేవలం నాలుగు నిమిషాల్లో రిప్లై రావడంతో నెటిజన్లు సత్య మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
Satya Nadella: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్‌ ని ఎంజాయ్‌ చేశా

ప్రముఖ టెక్ సంస్థల్లో పని చేసే వ్యక్తులు, వ్యాపార దిగ్గజాలు ఈ మధ్య తరచూ యూట్యూబ్‌ పాడ్‌ కాస్ట్‌ లో కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇక వీరిని షోకు రప్పించేందుకు యూట్యూబర్లు చాలానే శ్రమించాల్సి వస్తుంది. కానీ భారత సంతతికి చెందిన ఓ యూట్యూబర్‌ మాత్రం కేవలం నాలుగు నిమిషాల్లో టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ను ఇంటర్వ్యూకు ఒప్పించాడు.

Also Read: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్‌ గా ముందుకు దూసుకుపోండి!

చిన్న ఇ-మెయిల్‌ సాయంతో అనుకున్న పని సాధించాడు.అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ యూట్యూబర్‌ ద్వారకేశ్‌ పటేల్‌..ప్రముఖులు,టెక్ సంస్థ వ్యవస్థాపకులతో పాడ్‌కాస్ట్‌ లు చేస్తుంటాడు. తన ఛానల్‌ కు సంబంధించిన న్యూస్‌ లెటర్‌ సబ్‌ స్క్రైబర్ల లిస్ట్‌ లో ఉన్న నాదెళ్లను షోకు ఆహ్వానించేందుకు నేరుగా ఈ మెయిల్‌ పంపాడు.

Also Read: AP: ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సర్కార్

హాయ్‌ సత్య..నా న్యూస్‌ లెటర్‌ సబ్‌స్క్రైబర్‌ లిస్ట్‌ లో మీరు ఉండడం గమనించా. నా షోలో పాల్గొనేందుకు మీరు ఆసక్తిగా ఉన్నారా? అంటూ చిన్ని మెయిల్ను పంపాడు. మార్క్‌ జుకర్‌ బర్గ్‌,టోనీ బ్లెయిర్‌ వంటి ప్రముఖులు ఇప్పటికే తన పాడ్‌ కాస్ట్‌ లో పాల్గొన్నట్లు అందులో వివరించారు.

ఈ మెయిల్‌ను పంపిన నాలుగు నిమిషాలల్లోనే సత్య నాదెళ్ల నుంచి సమాధానం రావడంతో యూట్యూబర్‌ ఆశ్చర్యపోయాడు. ద్వారకేశ్‌ తన ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నాడు. ఈ మెయిల్‌ కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ లను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నాడు. తాజాగా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్‌, ఎక్స్‌ వేదికగా ఉంచాడు.

34 ఏళ్లుగా చాలా...

పాడ్‌ కాస్ట్‌ లో పాల్గొన్న నాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో తన ప్రయాణం గురించి పంచుకున్నారు. గత 34 ఏళ్లుగా చాలా ఉత్సాహంగా కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్ , క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి అంశాల గురించి ఈ పాడ్‌ కాస్ట్ లో చర్చించారు. 

Also Read: Zelensky-Starmer: ఉక్రెయిన్‌ కి మద్దతుగా బ్రిటన్ ప్రధాని!

Also Read: Yuzvendra Chahal : అధికారికంగా విడాకులు తీసుకున్న చాహల్-ధనశ్రీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment