Former CIA Officer: సీఐఏనే బురిడీ కొట్టించిన మాజీ అధికారి.. ఇంట్లో 300 కేజీల బంగారం!

సీఐఏలో పనిచేసిన డేవిడ్ రష్ సంస్థ నిధులను, విలువైన వస్తువులను కొల్లగొట్టి తన ఇంటిని బంగారు గనిలా మార్చుకున్నాడు. రూ.382 కోట్ల విలువైన 303 కిలోల బంగారు బిస్కెట్లు, 2 మిలియన్ డాలర్ల నగదు, 35 ఖరీదైన రోలెక్స్ లగ్జరీ వాచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
FotoJet

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, రహస్యంగా పనిచేసే నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA). పెద్ద పెద్ద దేశాల గూఢచారులనే బురిడీ కొట్టించే ఈ సంస్థనే.. ఇందులో పనిచేసే ఓ అధికారి మోసం చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. సీఐఏలో పనిచేసిన డేవిడ్ రష్ అనే వ్యక్తి సంస్థ నిధులను, విలువైన వస్తువులను కొల్లగొట్టి తన ఇంటిని బంగారు గనిలా మార్చుకున్నాడు. డేవిడ్ రష్ గతంలో సీఐఏలో ఉన్నత పదవిలో కొనసాగాడు. ఈ సమయంలోనే అతను తన హోదాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సొమ్మును భారీగా దోచుకున్నాడు. ముఖ్యంగా 2025-2026 మధ్య కాలంలో సంస్థ అవసరాల కోసం అంటూ భారీగా బంగారం, నగదును తీసుకున్నాడు.

ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!

ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

భారీగా నగదు, ఖరీదైన వాచ్‌లు..

ఎక్కడా ఈ ఖర్చుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయకుండా.. ఆ ఆస్తులను రహస్యంగా తన సొంత నివాసానికి తరలించాడు. సీఐఏ తన నిధుల వినియోగంపై తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని ఎఫ్‌బీఐకి తెలిపారు. ఎఫ్‌బీఐ అధికారులు వర్జీనియాలోని రష్ నివాసంపై దాడి చేసినప్పుడు వాళ్లకు షాకింగ్ విషయాలు కనిపించాయి. దాదాపు రూ.382 కోట్ల విలువైన 303 కిలోల బంగారు బిస్కెట్లు, 2 మిలియన్ డాలర్ల నగదు, 35 అత్యంత ఖరీదైన రోలెక్స్ లగ్జరీ వాచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు