Sunil Gavaskar: ఇండియా-పాక్‌ టీమ్‌లపై గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌-పాక్‌ టీమ్‌లపై లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. భారత్‌-పాక్‌ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్‌.. పాకిస్థాన్‌ టీమ్‌ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు.

New Update
Sunil Gavaskar: ఇండియా-పాక్‌ టీమ్‌లపై గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌-పాక్‌ టీమ్‌లపై లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. భారత్‌-పాక్‌ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్‌.. పాకిస్థాన్‌ టీమ్‌ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు. మరోవైపు ఇటీవల ఆసియా కప్‌లో భారత బౌలర్లను చూస్తే ఒకప్పటి ఆసిస్‌ టీమ్‌ గుర్తొచ్చిందన్నారు. ఆసిస్‌ టీమ్‌లో బ్రెట్‌లీ, మిచెల్‌ జాన్స్‌లు తమ నిప్పులు చెరిగే బంతుల ముందు ఎంతటి మేటి బ్యాటర్లైనా వికెట్‌ సమర్పించుకునేవారని గుర్తు చేశారు.

ప్రస్తుతం భారత బౌలింగ్‌ విభాగం అలానే ఉందని, ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ ఆసిస్‌ బౌలర్లలా కన్పించిందన్నాడు. సిరాజ్‌, బుమ్రా, మహ్మద్‌ షమి, వరల్డ్ కప్ టోర్నీలో సైతం తమ ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తే కచ్చితంగా కప్‌ మళ్ళీ భారత్‌ వశం అయ్యే అవకాశలు అధికంగా ఉన్నాయన్నారు. మరోవైపు పాక్‌ టీమ్‌లో బౌలర్లకు కొదవలేదన్న గవాస్కర్‌.. కానీ వారి బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదన్నాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌, కీపర్‌ రిజ్వాన్‌ల మీదనే పాక్‌ టీమ్‌ ఆధారపడి ఉందన్నాడు. వీరిని ఎంత త్వరగా ఫెవీలియన్‌ పంపితే పాక్‌ను అంత త్వరగా ఆలౌట్‌ చేసే అవకాశం ఉందన్నాడు.

మరోవైపు వరల్డ్‌ కప్‌ స్వదేశంలో జరుగుతుండటం యువ ఆటగాళ్లకు కలిసి వచ్చే అంశం అన్నాడు. యువ ఆటగాళ్లు. ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌గిల్‌ తమ ప్రతిభ వరల్డ్‌ కప్‌ టోర్నీలో చూపిస్తే రాబోయే తరానికి భారత జట్టును ముందుకు నడిపించేది వారే అనడంలో అతిశయోక్తి లేదన్నారు. మరోవైపు పంత్‌ ఈ మెగా టోర్నీలో ఆడకపోవడం వల్ల అతని ఫ్యాన్స్‌తో పాటు భారత ప్లేయర్లు సైతం నిరత్సాహ పడే అంశమన్నాడు. కాగా టీమిండియా అంటే ఇప్పటి వరకు బ్యాటింగ్‌ టీమ్‌ మాత్రమే అని స్పిన్నర్‌లపై ఆధార పడే టీమ్‌ అనే పేరు ఉండేదన్న ఆయన.. ఇకపై భారత పేసర్లను చూసి ప్రత్యర్థి బ్యాటర్లు బయపడుతారని గవాస్కర్‌ పేర్కొన్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పెళ్లయిన 6 రోజులకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు..

జమ్మూకశ్మీర్‌లో వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో  లెఫ్టినెంట్ వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే  ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్‌.. ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. 

Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది. భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

 telugu | Pahalgam attack

 

Advertisment
Advertisment
Advertisment