Telangana : అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం..

అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

New Update
Telangana : అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం..

America : అమెరికాలో భారత సంతతి విద్యార్థులు(Indian Students) వరుసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. అయితే తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగో(Chicago) లో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. 'ఇండియాకు చెందిన రూపేశ్‌ చంద్ర చింతకింది అనే విద్యార్థి మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రూపేశ్‌ ఆచూకి తెలుస్తుందని ఆశిస్తున్నామని' షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలిపింది.

Also Read: ఈరోజు జీరో షాడో డే.. ఎప్పుడంటే

మరోవైపు పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన రూపేశ్‌ ప్రస్తుతం విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. అతడు వారం రోజులుగా కనిపించకుండా పోవండతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కొడుకు ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా(USA) ఎంబసీని కోరారు.

ఇదిలాఉండగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి అగ్రరాజ్యంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన రేపుతోంది. పలు దాడులు, కిడ్నాప్‌లు(Kidnap), రోడ్డు ప్రమాదాలు(Road Accidents) వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తమ గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని అమెరికా చెప్పింది.

Also Read: నేటి నుంచి ఇంటర్‌ ప్రవేశాలు ప్రారంభం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment