Jammu-kashmir: పూంచ్‌లో చైనా గ్రెనేడ్లు..స్వాధీనం చేసుకున్న భారత ఆర్మీ

జమ్మూ–కశ్మీర్‌‌లోని పూంచ్ జిల్లాలోని షీందార్ సెక్టార్‌‌లో ఆరు చైనా గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకుంది భారత ఆర్మీ. గత కొన్ని రోజులుగా భారత ఆర్మీ మీద ఉగ్రవాదులు దాడులు జరుపుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలో భారత ఆర్మీ చేస్తున్న తనిఖీల్లో గ్రనేడ్లు దొరికాయి.

New Update
Terrorists: దేశ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం..

Indian Army: మరికొన్ని రోజుల్లో జమ్మూ–కశ్మీర్‌‌లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు మూడు దఫాల్లో జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ జమ్మూ–కశ్మీర్‌‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. రోజూ అన్ని ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాల్లో ఎక్కువగా తనిఖీలను నిర్వహిస్తోంది. ఈ రోజు జరిపిన సోదాల్లో భారత ఆర్మీ ఆరు గ్రనేడ్లను స్వాధీనం చేసుకుంది. చైనాలో తయారైన గ్రనేడ్లుగా ఆర్మీ గుర్తించింది. పూంచ్‌ జిల్లాలోని షీందార్ సెక్టార్‌‌లో ఇవి లభ్యమయ్యాయి. ఇక గత వారం లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని ఇదే జిల్లాలో భారత ఆర్మీ పట్టుకుంది. ఇతను లష్కరే తోయిబా గైడ్‌గా గుర్తించింది. అంతకు ముందు ఏప్రిల్‌లో ఒకతనిని భారత సైన్యం పట్టుకున్నారు. అతని దగ్గర పాకిస్థాన్‌లో తయారైన పిస్టల్, రెండు చైనీస్ గ్రెనేడ్‌లు లభించాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి గ్రనేడ్లను ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు