Team India : 17 ఏళ్ళ కల నెరవేరింది.. విశ్వవిజేతగా భారత జట్టు

కోట్లాది భారతీయుల కల నెరవేరింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయం చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు రోహిత్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమ్ ఇండియా విక్టరీ కొట్టింది.

New Update
Team India : 17 ఏళ్ళ కల నెరవేరింది.. విశ్వవిజేతగా భారత జట్టు

T20 World Cup : దాదాపు గెలవడం అసాధ్యం అనుకున్న తరుణంలో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా (Team India) ను టీ 20 వరల్డ్‌కప్‌ ను ముద్దాడేలా చేశారు. చాలా బాగా ఆడుతున్న దక్షిణాఫ్రికా (South Africa) ను కట్టడి చేయడంలో బౌలర్లు పూర్తిగా సక్సెస్ అయ్యారు. చివరకు టీమ్ ఇండియా 17 ఏళ్ళ కలనెరవేర్చుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరీక్షణ ఫలించింది. చివర వరకు నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ సాగింది. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టం అయింది. అసలు సిసలైన ఫైనల్ మ్యాచ్ జరిగింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఆరంభం బాగానే చేసినా నాలుగు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టోర్నీ అంతా బాగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చాలా తొందరగా ఔట్ అయిపోయాడు. తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా అతి తక్కువ రన్స్‌కే పెవిలియన్స్‌కు చేరాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడాడు. స్కై తరువాత అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు వచ్చాడు. ఒక పక్క సంయమనంగా బ్యాటింగ్ చేస్తూనే అక్షర్ ఆడపాదడపా సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ టీమ్ ఇండియా స్కోరును ముందుకు నడిపించారు. మరోవైపు కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తరువాత కాస్త దూకుడుగా ఆడి 76 పరుగుల దగ్గర వికెట్ కోల్పోయాడు. దీని తరువాత కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగసేసరికి టీమ్ ఇండియా 176 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయినా...తరువాత మాత్రం చాలా దూకుడుగా ఆడింది. డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్‌లు చితకొట్టారు. క్లాసెన్ అయితే 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. క్వింటన్‌ డికాక్‌ (39; 31 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌), స్టబ్స్‌ (31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య (3/20), బుమ్రా (2/18), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/20) అదరగొట్టారు. అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశాడు. ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచేస్తారు, కప్పు కొట్టేస్తారు అనే పరిస్థితి వచ్చింది. బాల్స్, పరుగులు సమానం కూడా అయిపోయాయి. కానీ భారత బౌలర్లు కీలకమైన వికెట్లు తీయడం, పరుగులు కట్టుదిట్టం చేయడంతో భారత విజయం ఖాయం అయింది.

Also Read :  టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment