Pakistan Election: పాకిస్థాన్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు..

పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో పీటీఐ పార్టీ 91 సీట్లలో గెలించింది. నవాజ్ షరీఫ్ సారథ్యంలో పీఎంఎల్-ఎన్ పార్టీ 71 స్థానాల్లో గెలిచింది. ఇక పీపీఈ 50, ఇతర పార్టీలు 20 స్థానాల్లో గెలుపొందాయి.

New Update
Pakistan Election: పాకిస్థాన్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు..

పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉండి కూడా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి కాలేదు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు నెమ్మదిగా జరుగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ బలపరిచిన అభ్యర్థులు 92 సీట్లలో విజయం సాధించారు. ఇక నవాజ్ షరీఫ్‌ సారథ్యంలో పీఎంఎల్‌-ఎన్‌ 64 స్థానాల్లో గెలిచింది. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) 50, ఇతర పార్టీలు 20 స్థానాలు సొంతం చేసుకున్నాయి.

133 సీట్లు కావాలి

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికల నిర్వహిస్తారు. మిగతా 70 స్థానాలు మైనారిటీలు, మహిళలకు కేటాయిస్తారు. అయితే ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే పాకిస్థాన్‌లో అధికారం దక్కించుకోవాలంటే.. 133 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే.. ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీకే ఇ- ఇన్సాఫ్‌(PTI)', నవాజ్‌ షరీఫ్ పార్టీ 'పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌' (PML-N) అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

Also Read: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు.. ఎప్పటి నుంచంటే..

సంకీర్ణ ప్రభుత్వం వైపు చూస్తున్న షరీఫ్ 

అత్యధిక సీట్లు ఇమ్రాన్ పార్టీకి చెందిన అభ్యర్థులకు వస్తాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరు హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే నాలుగోసారి ప్రధాని పదవిని దక్కించుకోవాలనుకుంటున్న నవాజ్‌ షరీఫ్‌.. బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పీపీపీతో (PPP) కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని వివిధ రాజకీయ పక్షాలకు నవాజ్ షరీఫ్‌ పిలుపునిచ్చారు.

స్వతంత్ర అభ్యర్థులుగా దిగిన పీటీఐ అభ్యర్థులు

పీటీఐ పార్టీ మాత్రం.. తాము ఎవరితోనూ జత కట్టబోమని.. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతోంది. తోషాఖానాతో పాటు పలు కేసుల్లో జైలు శిక్ష పడటంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై ఇటీవల ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు సాంకేతిక కారణాల వల్ల ఆ పార్టీ గుర్తు బ్యాట్‌ కూడా రద్దైపోయింది. దీనివల్ల పీటీఐ అభ్యర్థులు వివిధ గుర్తులతో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన నవాజ్ షరీఫ్‌.. లాహోర్‌లో గెలిచి.. మన్సెహరాలో ఓడిపోయారు.

Also Read: గాయపడిన పాక్‌ ను బయట పడేయడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తా: నవాజ్‌ షరీఫ్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment