Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ పట్టివేత

కర్ణాటలోని మైసూరు జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌లో రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాల వేళ.. భారీ ఎత్తున మద్యం నిల్వలు పట్టుబడటం సంచలనం రేపుతోంది.

New Update
Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ పట్టివేత

Liquor Seized : మద్యం(Liquor), డబ్బులు(Money) పంచకుండా ఏ ఎన్నికలు కూడా జరగవనేది అందరికీ తెలిసిన సత్యమే. ఓటర్లను ఆకర్షించేదుకు పార్టీ నాయకులు తమ స్థాయికి తగ్గట్లు భారీగా ఖర్చులు చేస్తుంటారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections 2024) సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ కోడ్‌(Election Code) అమలులో ఉంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా నోట్ల కట్టలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. అయితే తాజాగా కర్ణాటకలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.100 కోట్ల విలువైన లిక్కర్ పట్టుబడింది.

Also Read : కవితకు మరో షాక్

ఇక వివరాల్లోకి వెళ్తే.. చామరాజనగర్‌ పార్లమెంటు పరిధిలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం సభ్యులు సందర్శించారు. ఈ ఆపరేషన్‌లో మైసూరు డివిజన్ ఎక్సైజ్‌ జాయింట్ కమిషనర్ కూడా ఉన్నారు. అక్కడ సెర్చ్‌ చేయగా.. వారికి అక్రమ లిక్కర్‌ను నిల్వ చేయడాన్ని గుర్తించారు. మొత్తం రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న వేళ.. ఇంత పెద్ద మొత్తంలో అక్రమం మద్యం నిల్వలు పట్టుబడటం దుమారం రేపుతోంది. అంతేకాదు ఇప్పటికే దాదాపు 14 వేలకు పైగా బాక్సులు కేరళకు చేరుకున్నాయని సమాచారం. అయితే ఇందులో ఇప్పటివరకు 7 వేల బాక్సులను మాత్రమే పట్టుబడ్డాయని తెలుస్తోంది. అక్రమ రవాణా, హోర్డింగ్‌ వంటి వాటికి పాల్పడటం వల్ల అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Government good news : రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Special Education Teachers |

Special Education Teachers |

AP Government good news : ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడనుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ఆశిస్తోంది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

    Advertisment
    Advertisment
    Advertisment