Hyderabad: రీల్స్ చేస్తోందని భార్యను చంపేసిన భర్త

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త భార్యను చంపేశాడు. ఇంట్లో పనులు చేయడం మానేసి ఫోన్ మాట్లాడుతోందని..రీల్స్ చూస్తోందని ఏకంగా హత్య చేసేశాడు. చపాతీ పీటతో తలపై మోది, చున్నీతో ఉరివేసి హతమార్చాడు.

New Update
Hyderabad: రీల్స్ చేస్తోందని భార్యను చంపేసిన భర్త

ఉప్పల్‌లోని న్యూభరత్ లో హోటల్‌లో పని చేస్తున్న మధుస్మిత, ప్రదీప బోలాలు ఐదు నెలలుగా ఉంటున్నారు. వీరు తరుచూ గొడవు పడుతూ ఉండేవారు. భర్త ప్రదీప్‌కు మధుస్మిత మీద అనుమానం. దానికి ఆమె ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడ్డం, రీల్స్ చేస్తుండడమే కారణం. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడుతుండేవారు. శుక్రవారం రాత్రి కూడా వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అదికాస్తా ఎక్కువై చపాతి పీటతో తలపై కొట్టడంతో మధుస్మిత స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ప్రదీప్ ఆమె మెడకు చున్నిని బిగించి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి పరారయ్యాడు.

ఈ మర్డర్‌ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఉప్పల్ పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు. నాలుగు టీం లతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బేగంపేట ఏరియాలో ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రదీప్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని రాచకొండ, మల్కాజ్ గిరి ఏసీపీ చక్రపాణి తెలిపారు.

Also Read:Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment