Hookah: సిగరెట్‌ కంటే హుక్కా ప్రమాదకరమా?.. హుక్కాతో కలిగే నష్టాలు

హుక్కా అనేది ఒక రకమైన డ్రగ్. హుక్కా తాగడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీని వల్ల ఆస్తమా, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హుక్కాతో పాటు మద్యం సేవిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

New Update
Hookah: సిగరెట్‌ కంటే హుక్కా ప్రమాదకరమా?.. హుక్కాతో కలిగే నష్టాలు

Hookah: ఈ మధ్య కాలంలో హుక్కా వినియోగం ఎక్కువైంది. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం సిగరెట్‌ తాగేవారి కంటే హుక్కా తాగే వారి సంఖ్య ఎక్కువ. కర్ణాటకతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే హుక్కా వినియోగాన్ని నిషేధించారు. ఇటీవల యువత ఎక్కువగా హుక్కాకు బానిసలవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ హుక్కా కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. హుక్కా అనేది ఒక రకమైన డ్రగ్. రోజురోజుకు యువత ఈ వ్యసనం బారిన పడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం హుక్కా తాగడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీని వల్ల ఆస్తమా, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

హుక్కా ఆరోగ్యానికి ఎంత హానికరం?

  • పురాతన కాలం నుంచి ప్రజలు హుక్కా తాగుతున్నారు. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. పొగాకు పెట్టి హుక్కా తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో హుక్కా నగరాల్లో వేగంగా పెరిగింది. సిగరెట్‌ల మాదిరిగానే ఇందులో నికోటిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇటీవలే ఫ్లేవర్ హుక్కా కూడా మార్కెట్‌లోకి వచ్చింది. ఫ్లేవర్ హుక్కా నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తుల్లోకి చేరి క్యాన్సర్‌కు కారణమవుతుంది. చాలా మంది హుక్కాతో పాటు మద్యం సేవిస్తారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

బ్యాక్టీరియా వ్యాప్తి:

  • చాలా మంది ఒకే హుక్కా తాగుతారు. దీని వల్ల ఒకరి నుంచి మరొకరికి వివిధ రకాల బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. చాలా మంది హుక్కా సిగరెట్ కంటే తక్కువ హానికరమని భావిస్తారు. కానీ ఇది కూడా సిగరెట్‌లా ప్రమాదకరం. హుక్కా పీల్చడం ఊపిరితిత్తుల్లో హానికరమైన టాక్సిన్స్, అలర్జీకి కారణం అవుతుంది. ఇందులో ఉండే రసాయనాలు ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయని, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మంకీ మైండ్‌ అంటే ఏంటి?.. ప్రవర్తన ఎలా ఉంటుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment