/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kejriwal-from-jail-jpg.webp)
Security Threat : ప్రస్తుతం తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారులకు అందడంతో వారు హై అలర్ట్ అయ్యారు. అదే జైల్లో ఉన్నటువంటి పలు గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశముందని అంచనా వేశారు. కేజ్రీవాల్ ఇప్పుడు జైల్ నంబర్-2లో ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు కూడా జరిగాయి. 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే ఓ నిందితుడిని గ్యాంగ్ వార్లో హత్య చేశారు. 2015లో ఢిల్లీలోని వసంత్ విహార్ దగ్గర జరిగిన ఓ హత్య కేసులో శ్రీకాంత్ను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: డిఫరెంట్గా నామినేషన్…రూపాయి నాణేలతో దాఖలు
కేజ్రీవాల్కు బెదిరింపులు
అయితే జైల్లో ఉండగా.. సహా ఖైదీలు అతడిని బ్యాట్లతో కొట్టి చంపేసినట్లు జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్కు బెదిరింపులు వచ్చాయి. తీహార్ జైల్లో ఖలిస్థానీలు దాడి చేస్తారని అతడు హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇటీవల విడుదల చేశాడు. దీంతో కేజ్రీవాల్ భద్రతకు ముప్పు ఉందనే అనుమానంతో అధికారులు అప్రమత్తయ్యారు.
క్విక్రెస్పాన్స్ బృందం ఏర్పాటు
ఇదిలా ఉండగా.. మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ(ED) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ దాదాపు 4.5 కిలోల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.అలాగే షుగర్ లెవల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయి. ఆ తర్వాత వైద్యులు ఆయనకు చికిత్స చేసి సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఇంటి నుంచే భోజనం వెళుతోంది. ఏదైన ఎమర్జెన్సీ అయితే స్పందించేందుకు కేజ్రీవాల్ గదికి దగ్గర్లోనే క్విక్రెస్పాన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
Also Read: ఇజ్రాయల్ కు హర్యానా యువకులు..జీతం రూ1.37వేలు
ఇక మంగళవారం తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్.. తన సతీమణి సునీత(Sunita Kejriwal) తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు తన న్యాయవాదితో కొన్ని నిమిషాలపాటు సమావేశమయ్యారు. అలాగే కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.
Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారన్నారు.
Komatireddy Raj Gopal Reddy
MLA Komatireddy Raj Gopal Reddy :గత కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పదవిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని. తన మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు.జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవించారు.రంగారెడ్డి, హైదరాబాద్కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటూ ప్రశ్నించారు.
Also Read : కల్యాణ్రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
అధిష్టానం వద్ద తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు. తనకు అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు.
Also Read : 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
అయితే మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, ఆయా నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..
అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు.
Also Read : 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి
AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!
Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల ఆందోళన
Jallianwala Bagh: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
Union Govt and CPI Maoist Party : మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
SRH Highlights: సన్రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!