Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ తాగించాలి?..లేకపోతే ప్రాణాలకే ప్రమాదమా?

పిల్లలకు కాఫీ, టీలు ఇస్తే అది నేరుగా మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి పిల్లల నిద్రపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కెఫిన్ కలిగిన పానీయాలు ఇవ్వకుండా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. టీ, కాఫీలు అలవాటు చేసుకుంటే నిద్ర దెబ్బతింటుంది.

New Update
Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ తాగించాలి?..లేకపోతే ప్రాణాలకే ప్రమాదమా?

Tea: కొన్ని నెలల క్రితం టీ తాగి 18 నెలల చిన్నారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దీంతో పిల్లలకు ఏ వయసులో టీ తాగించాలనే చర్చ ప్రతి తల్లిదండ్రుల్లో మొదలైంది. అసలు ఏ వయసు పిల్లలు టీ తాగవచ్చో అనేదానిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి:

  • మొక్కల నుంచి తేయాకు తయారవుతుంది. వీటితో చేసిన టీ, కాఫీలు మన మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచేలా చేస్తాయి. పిల్లలకు 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కెఫిన్ కలిగిన పానీయాలు ఇవ్వకుండా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కెఫిన్ అధికంగా ఉండే పానీయాలను ఎక్కువగా తీసుకో కుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. 12 సంవత్సరాల వయస్సు వరకు కెఫిన్ కలిగిన పానీయాలు ఇవ్వడం మానుకుంటే మంచిది. ఇందులో కొంత మేలు ఉంది కానీ చాలా చెడు కూడా ఉంది.

నిద్రపై ప్రభావం:

  • పిల్లలకు కాఫీ, టీలు ఇస్తే అది నేరుగా మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి పిల్లల నిద్రపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సాయంత్రం పూట టీ, కాఫీలు ఇస్తే వారి నిద్ర దెబ్బతిని మరుసటి రోజు ఉదయం బాగా అలసిపోతారు. రోజూ టీ, కాఫీలు అలవాటు చేసుకుంటే వాటికి అడిక్ట్ అవుతారు. టీ, కాఫీలు ఎక్కువగా తాగితే మూత్ర విసర్జన చేయాలని ఎక్కువగా అనిపిస్తుంది. పిల్లలకు పాల రుచి నచ్చక టీ, కాఫీలను ఎక్కువగా ఇష్టపడతారు. దీన్ని నివారించడానికి, పాలకు రుచి, వాసన కోసం అల్లం జోడించాలని నిపుణులు అంటున్నారు. యాలకులు, బెరడు, తులసి మొదలైనవి వేయవచ్చు. లేదా ఖర్జూరం, ఎండుద్రాక్ష, పొడి గింజలు వంటి పోషక విలువలున్న ఆహారాలతో మిక్స్ చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే.. మధ్యప్రదేశ్‌లో చిన్నారి మృతికి టీ తాగడమే కారణమని నిశ్చయంగా చెప్పలేమని వైద్యులు అంటున్నారు. టీ తాగేటప్పుడు పిల్లవాడు సరిగ్గా మింగలేడు. ఇది శ్వాసనాళాన్ని కూడా అడ్డుకుంటుంది. శ్వాస తీసుకోలేకపోవడం వల్ల పిల్లవాడు మరణించి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి :  మహాశివరాత్రి, మాసశివరాత్రికి మధ్య తేడా ఏంటి..?..రెండింటి ప్రాముఖ్యత ఇదే!

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment