EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి!

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

New Update
EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి!

Ex Mla: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద శనివారం రాత్రి డివైడర్ల మధ్య నుంచి రోడ్డును దాటుతుండగా..హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు వెళ్తున్న రాజయ్య కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజయ్య ఉన్నారు. కారును బాపూజీ నగర్‌ లో వదిలేసి మడికొండ పోలీసులకు స్వయంగా రాజయ్యే సమాచారం అందించారు. ఆ తరువాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read: ఏపీ లో 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు