Sydney: షాపింగ్ మాల్లో దారుణం.. ఐదుగురిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ మాల్లోకి ప్రవేశించి అక్కడికి వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. By B Aravind 13 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sydney Mass Stabbing: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు ఓ మాల్లోకి ప్రవేశించి అక్కడికి వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో పులువురు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం నిందితులపై కాల్పులు జరిపారు. పోలీసులకు జరిపిన కాల్పుల్లో ఓ నిందితుడు మృతి చెందాడు. Also Read: పైడి రాకేష్రెడ్డికి బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి ఊడే ఛాన్స్! మరోవైపు మాల్లో ఉన్నవారిని కూడా సిబ్బంది అక్కడి నుంచి బయటికి తరలించారు. మాల్వైపు ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఓ వ్యక్తి పెద్ద కత్తిలో మాల్లో తిరిగిన దృశ్యాలు అక్కడి స్థానిక మీడియాలో కనిపించాయి. గాయాలపాలైన వ్యక్తులు నేలపై పడిపోయారు. వాళ్లో తల్లీబిడ్డ కుడా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అలాగే వాళ్ల రక్తస్రావాన్ని ఆపేందుకు అక్కడ ఉన్న దుస్తుల్ని వాడినట్లు చెప్పారు. అయితే దుండగులు ఎలాంటి ఉద్దేశంతో ఈ దాడులకు పాల్పడ్డారనే విషయం తెలియలేదు. Also Read: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది? #telugu-news #sydney #australia #attack సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి