Crime News: దారుణం.. బతికుండగానే బిడ్డను పాతిపెట్టిన తండ్రి

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. బిడ్డ పుట్టిన 15 రోజులకే ఓ తండ్రి ఆ చిన్నారిని సజీవంగా పాతిపెట్టాడు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్సకు డబ్బులు లేకే ఈ పని చేశానంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

New Update
Murder: ఓరి దుర్మార్గుడా.. భార్యమీద కోపంతో రెండు నెలల బిడ్డను చంపిన కానిస్టేబుల్!

పెళ్లి తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఓ తండ్రి మాత్రం.. 15 రోజులు కూడా నిండని ఓ పసికందును బతికుండగానే పాతిపెట్టడం సంచలనం రేపింది. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఈ నేరం చేసినందుకు ఆ తండ్రి చెప్పిన కారణం విని పోలీసులు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో తయ్యబ్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. 15 రోజుల క్రితం తన భార్య ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థతి సరిగా లేదు.

Also read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్

దీంతో తన బిడ్డకు చికిత్స చేయించేందుకు డబ్బు లేకపోవడం వల్లే.. బతికుండగానే గొయ్యితీసి పాతిపెట్టానని తయ్యబ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన బిడ్డను ఒక గోనె సంచిలో తీసుకెళ్లి.. థారుశాహ్ అనే ప్రాంతంలో సమాధి చేశానని చెప్పాడు. అతడు నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఫొరెన్సిక్ పరీక్ష కోసం ఆ సమాధినికి తవ్వనున్నారని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. గతంలో కూడా పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. బిడ్డ ముఖాకృతి సరిగా లేదని.. పుట్టిన రెండురోజులకే ఓ తండ్రి ఆ చిన్నారని సజీవంగా పాతిపెట్టాడు.

Also Read: ఆలయం బయట రాహుల్‌ ఫొటోతో డోర్‌మ్యాట్‌.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MUMBAI: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

మైనర్ బాలిక గర్భందాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ కేసులో యువకుడికి బెయిల్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. 

New Update
Ongole POCSO court

Mumbai High Court sensational verdict in minor girl case

MUMBAI CASE: మైనర్ బాలిక గర్భం దాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. అయితే బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ--- కేసులో యువకుడికి బెయిల్ మంజూరు  చేసింది న్యాయస్థానం. 

10 నెలల గర్భంతో ఇంటికి..

ఈ ఘనటన 2020లో జరగగా తాజాగా కేసు విచారించిన ముంబై హైకోర్టు.. కీలక తీర్పు వెల్లడించింది. నవీ ముంబైకి చెందిన మైనర్ బాలిక 2020లో యూపీ యువకుడితో లేచిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో తిరిగి ఇంటికి వచ్చింది. విషయం గమనించిన మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.  ఈ కేసును సోమవారం విచారించిన న్యాయస్థానం..'బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరిగిందో ఆమెకు తెలుసు. కాబట్టి ఈ కేసులో అతినికి బెయిల్ మంజూరు చేయాల్సిందే' అని స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇదిలా ఉంటే..సిక్కింలో గ్యాల్‌షింగ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మైనర్‌ బాలికపై ఏకంగా ఏడాదిగా అత్యాచారం జరిగింది. చివరికి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఫిర్యాదు మేరకు నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకి అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. జిల్లాలోని 13 ఏళ్ల బాలికను ఓ మహిళ పనుల్లో సాయం చేసేందుకు ప్రతిరోజూ తన ఇంటికి తీసుకెళ్లేది. ఆ తర్వాత బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

 minor-girl | pregnent | high-court | today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment