Face Pack: పండిపోయిన పండ్లతో ఫేస్‌ ప్యాక్‌.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం

అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. అయితే వాటిని చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

New Update
Face Pack: పండిపోయిన పండ్లతో ఫేస్‌ ప్యాక్‌.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం

Face pack With Ripe Fruits: ఎక్కువగా పండిన పండ్లను నిల్వ ఉంచినప్పుడు అవి పాడైపోతాయి కాబట్టి వాటిని తినడం మానేస్తాం. అటువంటి పరిస్థితిలో మనం ఈ పండ్లను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. పండ్లు అతిగా పక్వానికి వచ్చినప్పుడు వాటి రుచి చెడిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఆ పండ్లను తినడానికి బదులుగా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అనేక రకాల స్క్రబ్‌లను తయారు చేసుకోవచ్చు. ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇంకా అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చు.

Face pack With Ripe Fruits

బాడీ స్క్రబ్:

బాగా పండిన పండ్ల నుంచి బాడీ స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ పండ్ల నుంచి స్క్రబ్ చేయడానికి వాటిని మెత్తగా చేసి కొద్దిగా కాఫీ పొడి లేదా గంధం కలపండి. అంతే కాకుండా ఇందులో బియ్యపు పిండిని కూడా కలుపుకోవచ్చు. స్క్రబ్ చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే దానిపై తొక్కను కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా అరటి, నారింజ తొక్కలను పడేయకుండా వాటిని కూడా వాడుకోవచ్చు.

publive-image

జుట్టు కోసం:

బాగా పండిన పండ్ల నుంచి హెయిర్ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అరటిపండుతో హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం అరటిపండును మెత్తగా చేసి దానికి కొద్దిగా పెరుగు కలపాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి వాటిని జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాకుండా నారింజ, అవకాడోతో కూడా చేయవచ్చు.

Face pack With Ripe Fruits

ఫేస్ ప్యాక్:

పండ్లతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేయడం సర్వసాధారణం. యాపిల్ ఎక్కువగా పండినా లేదా బొప్పాయి బాగా పండినా మీరు దాని నుండి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్‌లు చర్మానికి మెరుపు తెస్తుంది. అంతేకాకుండా జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ముఖానికి ఆరెంజ్ మాస్క్‌ను కూడా వేసుకోవచ్చు.

Face pack With Ripe Fruits

స్మూతీస్, సూప్‌లు:

అతిగా పండిన పండ్ల నుంచి స్మూతీస్, సూప్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. దీన్ని పాలతో తయారు చేసుకోవచ్చు. పండ్ల రసంలో ఉప్పు, పుదీనా కలపడం ద్వారా స్మూతీగా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పండిన పండ్లను పారేయాల్సిన అవసరం ఉండదు.

ఇది కూడా చదవండి: ఇలా చేశారంటే బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment