Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు

మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.

New Update
Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు

Veg - Non-Veg : సాధారణంగా మాంసాహారం(Non-Vegetarian) కంటే శాఖాహారం(Vegetarian) తినేవారే ఆరోగ్యంగా ఉంటారనే మాటలు మనం తరుచుగా వింటుంటాం. ఏవైన దీర్ఘకాలిక వ్యాధులకు గురైనప్పుడు కొందరు మొత్తం మాంసాహారాన్నే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే శాఖాహారం తిన్నంత మాత్రనే వారు ఆరోగ్యం(Healthy) గా ఉంటారనే గ్యారెంటీ లేదు. మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ(Oxford University) నిర్వహించిన పరిశోధనలో తేలింది.

Also Read : యూట్యూబ్‌.. భారత్‌కు చెందిన వీడియోలు ఎన్ని తొలగించందంటే

మాంసాహారాన్ని పూర్తిగా తినకపోవడం.. పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం వల్ల శాఖాహారుల్లో బాడీమాస్ ఇండెక్స్(BMI) తగ్గుతుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే శాఖాహారుల్లో క్యాల్షియం పాళ్లు పడిపోవడం వల్ల ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఎక్కులగా ఉంటుందని చెబుతున్నారు. మాంసాహారం తినేవారితో పోలిస్తే.. శాఖాహారుల్లోనే తుంటి ఎముక విరిగే ప్రమాదం రెండున్నర రేట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

అంతేకాదు. శరీరంలో ఎక్కడైన చిన్నచిన్న దెబ్బలు తగిలినా కూడా.. కాలు ఎముక విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ కూడా.. శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.

Also Read : వేసవిలో ఇవి తింటే శరీరంలోని నీరంతా మాయం..జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment