High prices:ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

ఇలా అయితే బతకడం ఎలా అంటున్నారు సామాన్య మానవులు. పట్టెడన్నం తిందామంటే అవకాశం లేకుండా పోయింది. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 80 రూ. అయ్యింది.

New Update
High prices:ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

High prices:కూరల ధరలు పెరిగిపోయాయి...గుడ్డు కాస్టలీ అయిపోయింది...చికెన్ ధర పైపైకి ఎగిరిపోతోంది..చివరకు పోనీ గంజెన్నం తిందామన్నా కుదరడం లేదు. బియ్యం ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. నవబర్ లో సోనామసూరి బియ్యం కేజీ 65 రూ. ఉంటే...డిసెంబర్‌కు అది 75రూ అయింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అది ఇంకాస్త పెరిగి 80 రూ అయి కూర్చుంది. మరోవైపు రూ.80 పెడితే కానీ డజను గుడ్లు దొరకడం లేదు. సరే గుడ్డు లేదు కోడినే తిందామా అంటే...చికెన్‌ ధరలూ భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం లైవ్‌ కోడి ధర రూ.140 ఉండగా మంగళవారం రూ.160కు పెరిగింది. స్కిన్‌లెస్‌ రూ.240కు చేరింది. మటన్ అయితే ఏకంగా కేజీ వెయ్యికి పైనే ఉంది.

Also Read:చౌకగా మారనున్న విమాన ప్రయాణం..తగ్గిన ఇంధనం ధరలు

ఆంధ్రాలో తుఫాను ప్రబావం వరి పంట మీద బాగా పడింది. దీంతో బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో పాటూ ప్యాకింగ్‌, రవాణా ఛార్జీలతో క్వింటా రూ.6500 నుంచి రూ.7 వేల వరకూ అవుతోందంటున్నారు వ్యాపారులు. అందుకే రిటైల్‌లో కిలో రూ.75 నుంచి రూ.80 వరకూ ఉంటుందన్నారు. ఇక కూరగాయలు కూడా బాగా ప్రియం అయిపోయాయి. ఏ కూరగాయా కిలో 50 రూ. తక్కువ లేదు. ఉల్లిపాయలు, పర్చిమిర్చి లాంటివి కూడా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో పేద, సామాన్య ప్రజలు ఏడుస్తున్నారు. తాము ఏం తిని బతకాలని అడుగుతున్నారు. ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకుని ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment