Weight Loss : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు

ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది.

New Update
Weight Loss : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తిన్నారంటే సులభంగా బరువు తగ్గొచ్చు

Weight Loss Tips : బరువు ఎక్కువగా(Over Weight) ఉన్నవారు తగ్గడానికి ఏమి తినాలని ఆలోచిస్తారు. అయితే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడం(Weight Loss) లో ఇది ఎంతో మేలు చేస్తుంది. జిమ్(Gym) గురించి ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, ఆహారం ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే, బరువు తగ్గడానికి ఉదయం(Morning) ఖాళీ కడుపు(Empty Stomach) తో ఈ పదార్థాలు తింటే బరువు తగ్గుతారు. ఏం తింటే బరువు తగ్గుతారో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చియా విత్తనాలు:

  • చియా గింజలు(Chia Seeds) ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఉదయం స్మూతీలో వాటిని కలిపి తింటే మంచిది.

గంజి:

  • ఇది తినడం ద్వారా మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది.

గుడ్లు:

  • గుడ్లు(Eggs) ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కోడిగుడ్లు తినడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు. రోజంతా తక్కువ కేలరీలు వినియోగించుకోవచ్చు. ఉదయాన్నే ఉడికించిన గుడ్లు తింటే మేలు.

బ్లూబెర్రీస్:

  • స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్న బెర్రీలు తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

గ్రీక్ పెరుగు:

  • ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ పదార్ధం పొట్ట నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. పండ్లు, తేనెతో తింటే మంచిది.

ఇది కూడా చదవండి: బాత్‌రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్తున్నారా..ఈ అనర్థాలు తప్పవు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే జామకాయ రసం తాగితే ఏమవుతుంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment