Kota: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్‌

రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉన్నత చదువులు చదవాలని లేదు, దూరంగా వెళ్లిపోతున్నాను, ఐదేళ్లవరకు తిరిగిరాను అంటూ తన తల్లిదండ్రులకు అతడు మెసేజ్ పెట్టాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

New Update
Kota: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్‌

Kota Student Missing: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. మరికొందరు అదృశ్యమవుతున్నారు. అయితే తాజాగా నీట్‌ శిక్షణ (NEET Coaching) కోసం వచ్చిన మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. అంతకుముందు ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఓ మెసేజ్‌ పంపాడు. దీన్ని చూసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని (Rajasthan) బమన్‌వాస్ అనే ప్రాంతానికి చెందిన రాజేంద్ర మీనా కోటాలో నీట్‌ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవల అతడు తన తండ్రి జగ్‌దీశ్‌ మీనాకు ఓ మెసేజ్ పెట్టాడు. అందులో 'నేను ఇంటికి రాను.. వెళ్లిపోతున్నాను. ఉన్నత చదువులు చదవాలని లేదు. ఇప్పుడు నా దగ్గర రూ.8వేలు ఉన్నాయి. ఐదేళ్లవరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తాను. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను.

Also Read: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ

నా గురించి అమ్మను బాధపడొద్దని చెప్పండి. మీ అందరి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్ చేస్తాను' అని రాజేంద్ర మీనా మెసేజ్‌ పెట్టాడు. ఇది చూసి ఆందోళనకు గురైన అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 6వ తేదీ నుంచి తమ కొడుకు కనిపించడం లేదని.. ఆరోజు మధ్యాహ్నం కోటాలో హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. గత ఆదివారం నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇక కోటాలో చదువులు ఒత్తిడి వల్ల విద్యార్థులు వరసగా ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా సూసైడ్‌లు మాత్రం ఆగడం లేదు.

Also Read: ఆగస్టు 15లోగా 30 లక్షల ఉద్యోగాలు.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment