హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్

తమిళ్ హీరో ధనుష్ కుమారుడికి తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై అతివేగంగా వెళ్లినందుకు రూ.1000 జరిమానా విధించారు. అంతేకాదు స్వయంగా ఇంటికెళ్లి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

New Update
హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్

తమిళ్ స్టార్ హీరో ధనుష్‌ కుమారుడికి షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డుపై రూల్స్ బ్రేక్ చేసినందుకు తమిళనాడు పోలీసులు భారీ జరిమానా విధించారు. తాత రజనీకాంత్ ఇంటి నుంచి తన తండ్రి ధనుష్ ఇంటికి బైక్ పై అతను అతివేగంగా వెళ్లినట్లు గుర్తించారు. అంతేకాదు నేరుగా తన ఇంటికెళ్లి అబ్బాయికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

Also read :‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అతడే.. జోస్యం చెప్పిన యువరాజ్ సింగ్

అసలు విషయానికొస్తే.. త‌మిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు, కూతురు ఐశ్వర్య-ధనుష్ దంపతుల పెద్ద కొడుకు కొన్నిరోజుల కిందట ఫ్రెండ్స్ తో కలిసి యాత్రకు వెళ్లాడు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ బైక్ పై రయ్యిమంటూ రోడ్లపై దూసుకెళ్లినట్లు సీసీ పుటేజీల ద్వారా గుర్తించిన తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. అంతేకాదు అతను యాత్రలో ఉన్నప్పడు హెల్మెట్ వాడలేదని తెలిపారు. అలాగే అతను తన తాత రజనీకాంత్ ఇంటి నుంచి తన తండ్రి ధనుష్ ఇంటికి కూడా వేగంగా వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టగా అది ధనుష్ కొడుకు యాత్రది అని తేలింది. దీంతో ఈ విష‌యంపై ట్రాఫిక్ పోలీసులు ధనుష్ ఇంటికి వెళ్లి యాత్రకు సలహా ఇచ్చారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు యాత్రకు రూ.1000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా సెలబ్రిటీల పిల్లలు ఇలా చేస్తే సామాన్య జనాలు ఇంకెలా చేస్తారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?

నిర్మాత దిల్ రాజు రేపు భారీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. అయితే వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతుందని టాక్.

author-image
By Archana
New Update
dil Raju big announcement

dil Raju big announcement

Dil Raju:  సౌత్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గా  'గేమ్ ఛేంజర్' దెబ్బేసిన.. ఆ తర్వాత విడుదలైన  'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమా గట్టెక్కించింది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.  

దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్ 

ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ మరో అదిరిపోయే న్యూస్ చెప్పింది. రేపు దిల్ రాజు ఓ భారీ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

cinema-news | latest-news | dil-raju ameerkhan 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment