Bengaluru: బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్

బెంగళూరులో కొందరు దుండగులు అరాచకం సృష్టించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మొబైల్, నగలు, డబ్బులు దోచుకెళ్లారు. 

author-image
By Manogna alamuru
New Update
girl raped

బెంగళూరులో కేఆర్ మార్కెట్ దగ్గరలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఒక మహిళ పట్ల దౌర్జన్యానికి పాల్పడ్డారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 ఏళ్ళ మహిళను ఎత్తుకెళ్ళి రేప్ చేశారు. అక్కడితో వదిలేయకుండా ఆమె ఫోన్, నగలు, డబ్బును కూడా దోచుకెళ్లారు. అర్థరాత్రా 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గోడౌన్ స్ట్రీట్ దగ్గరలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read :  హనీ రోజ్ కేసులో బిగ్ ట్విస్ట్..  ఆ ఇద్దరు అధికారులు సస్పెండ్

ఒంటరి మహిళ మీద అఘాయిత్యం...

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..బాధితురాలు కొన్ని రోజులై ఒంటరిగా ఉంటున్నారు. ఆమె భర్తతో గొడవలు రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో  ఆ మహిళ యలహంకకు బస్సుల గురించి ఆరా తీస్తుండగా.. బస్టాప్ వేరే చోట ఉందని చెబుతూ ఇద్దరు వ్యక్తులు ఆమెను వేరే చోటుకి తీసుకెళ్ళారు.  ఆ తర్వాత వారు ఆమెను గోడౌన్ స్ట్రీట్‌లోని ఏకాంత ప్రదేశానికి ఎత్తుకెళ్లారు.  అక్కడ వారిద్దరూ ఆమెపై దాడి చేసి ఆమె మొబైల్ ఫోన్, నగలు మరియు నగదును అపహరించారు. అప్పుడే ఆమెపై బలాత్కారం కూడా కావించారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం కంప్లైంట్ నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తరువాత మహిళను షెల్టర్ హోంకు తరలించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద తెలిపారు. 

Also Read: IT Raids: దిల్ రాజు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : టచ్ చేస్తే చచ్చిపోతా.. ఫస్ట్ నైట్ రోజే వరుడికి వధువు షాక్.. చివరికి బిగ్ ట్విస్ట్!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

author-image
By Kusuma
New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండిషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment