Bengaluru: ఎంతకు తెగించార్రా.. ఒకడ్ని నమ్మి హోటల్ కు వెళ్తే.. నలుగురు కలిసి అత్యాచారం!

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఒక మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారు. బాధిత మహిళ క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు.

New Update
gang rape in Bengaluru

బెంగళూరు (Bengaluru) లోని కోరమంగళ ప్రాంతంలో ఒక మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారు. బాధిత మహిళ క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. వివాహిత అయిన ఆమెకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి కోరిక మేరకు హోటల్‌కు వెళ్లింది.  అక్కడ మరో ముగ్గురని అతడు ఆమెకు పరిచయం చేశాడు. 

Also Read :  వచ్చేస్తున్న వేసవి.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

హోటల్  లో డిన్నర్ చేశాక హోటల్‌ టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ సంఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.  

Also Read :  రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్‌ అయిన నవవధువు!

నిందితులందరూ 20 ఏళ్ల లోపు

వారిని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.  మరోకరు పరారీలో ఉండగా..  అతని కోసం గాలింపు చేపట్టారు.  నిందితులందరూ వేరే రాష్ట్రానికి చెందినవారని, హోటళ్లలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.  నిందితులందరూ 20 ఏళ్ల లోపు వారే.  బాధిత మహిళ ఢిల్లీకి చెందినదని...  ఆమె భర్తతో బెంగళూరులో నివసిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు.  

Also Read :  కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని హొయసల నగర్ ప్రాంతంలోని ఒక నిర్మాణ స్థలంలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి (Sexual Assault) చేసి హత్య చేశారు కొంతమంది దుండగులు. 2021–2023 మధ్య బెంగళూరులో 444 అత్యాచార కేసులు నమోదయ్యాయని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ఫిబ్రవరి 2024లో వెల్లడించారు. 

Also Read :  వంటింట్లో వాడే గరం మసాలాతో ఇన్ని లాభాలు ఉన్నాయా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment