Tamil Nadu: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ

తమిళనాడులోని కరూర్ సమీపంలో ఓ కుటుంబం ఆన్‌లైన్ రమ్మీకు బలైంది. ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి భార్య, పిల్లలను ఇంట్లో చంపిన ఆ తర్వాత రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ రమ్మీలో అప్పులు చేసి తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు.

New Update
Crime news balnagar

Tamilnadu

ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. వీటి మోజులో పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కరూర్ సమీపంలో ఓ కుటుంబం ఆన్‌లైన్ రమ్మీకు బలైంది. ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి భార్య, పిల్లలను ఇంట్లో చంపిన ఆ తర్వాత రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ రమ్మీలో అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రేమ్‌రాజ్ సూసైడ్ లేఖలో రాశాడు. దీని ద్వారా పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

అదుపు తప్పి లారీ ఢీకొట్టడంతో..

ఇదిలా ఉండగా తాజాగా ఏలూరు జిల్లా సోమవరప్పాడు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్సు అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. బస్సు నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు.

ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సహయక చర్యలు చేపట్టారు. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు మీద అడ్డం తొలగించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణం ఏంటని విచారిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment