Crime: మామకు రంగులు పూసిన కోడలు... మందలించిన అత్త.. అంతలోనే ఘోరం!

హోలీ పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.

New Update
Scolded For Applying Colour

హోలీ (Holi 2025) పండగ రోజు మామకు రంగు పూయడంతో కోడలిని మందలించింది అత్త. దీంతో మనస్తాపం చెందిన కోడలు విషం తాగి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు ధనవతిదేవి (30) హోలీ రోజున తన మామగారికి రంగు పూసింది. ఇది చూసిన ఆమె అత్తగారు ధనవతిదేవిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.  ధనవతిదేవిని వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించింది. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం కోసం పంపినట్లు సహత్వర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) దినేష్ పాఠక్ సోమవారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.  

Also read :  బూతులతో ట్రోల్స్.. ఏడేళ్లు నరకం చూశా.. శిల్పా చక్రవర్తి వీడియో వైరల్

Also Read:  బయ్యా సన్నీయాదవ్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరో షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్!

హోలీ వేడుకల్లో విషాదం

మరోవైపు బెంగళూరులో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ముగ్గురు కార్మికులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కార్మికులు ముందుగా గొడవకు దిగారని, ఆ తర్వాత కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. మరణించిన ముగ్గురు కార్మికులు బీహార్ నివాసితులనేని తేల్చారు. మృతులను అన్సు (22), రాధే శ్యామ్ (23), దీపు(23)గా గుర్తించారు. కార్మికులందరూ ఒకే గ్రామానికి చెందినవారని చెబుతున్నారు.

Also Read :  IDY 2025 ఉత్సవానికి సన్నాహలు.. 10 ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రకటించిన ఆయుష్ మంత్రి

Also read :  పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది.

New Update
UP inter student marriage

ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment