రంగులు చల్లవద్దు అన్నందుకు స్నేహితుడిని దారుణంగా.. ఏం చేశారంటే?

హోలీ రంగులు చల్లవదన్నందుకు స్నేహితుడిని చంపేసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. హన్సరాజ్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ముగ్గురు స్నేహితులు రంగులు వేయడానికి వస్తే.. వద్దని వేడుకున్నాడు. దీంతో స్నేహితులు హన్సరాజ్‌ను చంపేశారు.

New Update
holi colors

holi colors

ఇప్పటికే దేశంలోని పలు చోట్ల హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనపై రంగులు చల్లోద్దంటూ వారించిన ఓ 25 ఏళ్ల యువకుడిని ముగ్గురు దారుణంగా హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం హన్సరాజ్ అనే యువకుడు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో అశోక్, బబ్లు, కలురామ్ అనే ముగ్గురు హోలీ ఆడుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

ఒంటిపై రంగులు వేయవద్దన్నందుకు..

నాపై రంగులు చల్లవద్దని.. స్నేహితులను హన్సరాజ్ వేడుకున్నాడు. అయినా వినకుండా అతడిపై రంగు చల్లడంతోపాటు దాడికి పాల్పడ్డారు. బెల్తుతో అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితుల్లో ఒకడు.. హన్సరాజ్ గొంతునులిమి చంపినట్లు పోలీసలు గుర్తించారు. హన్సరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Roller Coaster Accident : మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. ఇంతకు ఏం జరిగిదంటే..  24 ఏళ్ల ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది.

New Update
women died husband

women died husband

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.  మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. ఇంతకు ఏం జరిగిదంటే..  24 ఏళ్ల ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది.  మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే ఇద్దరు కలిసి నైరుతి ఢిల్లీలోని కపాషెరా సమీపంలోని వాటర్ అండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లింది. 

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయి

పాపం అక్కడే వారి జీవితం మలుపు తిరిగింది. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇద్దరు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. బాగా ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది. దీంతో వెంటనే నిఖిల్ ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అయితే అప్పటికే ప్రియాంక చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.  ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు. 

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం

కాబోయే భార్యతో లైఫ్ లాంగ్ ఉండాలని ఎన్నో కలలు కన్న నిఖిల్.. ప్రియాంక తన కళ్లముందే చనిపోవడం చూసి కన్నీటిపర్యంతమయ్యాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక మృతి ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ప్రమాదంపై అమ్యూజ్‌మెంట్ పార్క్‌ ఇంకా ఎలాంటి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Also read : Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు