Crime story: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

తల్లిదండ్రుల క్షణికావేశానికి పసిబిడ్డలు బలవుతున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల మోజులో నవమాసాలు మోసిన తల్లులే ముక్కుపచ్చలారని పిల్లలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవడం సమాజాన్ని కలవరపెడుతోంది. 

New Update
children crime

Parents killing children for illicit relations

Crime story: దేశంలో తల్లిదండ్రుల క్షణికావేశానికి బలవుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. విహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒకరు.. భర్త ప్రేమను పంచట్లేదని మరొకరు.. చదువులో వెనకబడ్డారని ఇంకొకరు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మరొకరు. ఇలా కారణాలేవైనా పేరెంట్స్ తీసుకుంటున్న నిర్ణయాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతూనే ఉన్నారు.  

ముగ్గురు పిల్లలు కానరానిలోకాలకు..

తమిళనాడు పుదుకోట్టైలో తల్లి కసాయిగా మారింది. ఐదు నెలల చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసింది. భర్త తనపై కాకుండా తమకు పుట్టిన బిడ్డతో ప్రేమగా ఉంటున్నాడని కడతేర్చింది. మరో కేసులో ఓ తల్లి ప్రియుడితో కలిసి ఉండేందుకు పిల్లలకు విషమిచ్చింది. రాత్రి భోజనంలో విషం కలిపి ముగ్గురు పిల్లలను కానరాని లోకాలకు పంపించింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. 

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

కాళ్లు చేతులు కట్టేసి..

కాకినాడలో ఓ తండ్రి కన్నబిడ్డల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. చదువులో వెనకబడ్డారని ఇద్దరు పిల్లల జీవితాలను చిదిమేశాడు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టి బకెట్లో ముంచి ఊపిరి తీశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక హైదరాబాద్ హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందులతో ఫ్యామిలీ బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. పేరెంట్స్ ఉరేసుకుని చనిపోయారు.

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

తప్పు వారిదైనా శిక్ష పిల్లలకే..

తల్లిదండ్రుల ఒత్తిడి, క్షణికావేశం..ఇలా కారణాలు ఏవైనా పేరెంట్స్ తీసుకునే నిర్ణయాలతో అభంశుభం తెలియని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. తప్పు తల్లిదైనా.. తండ్రిదైనా శిక్ష మాత్రం పిల్లలు అనుభవిస్తున్నారు. ఎన్నోఏళ్ల జీవితాన్ని చూడాల్సిన చిన్నారులు చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లల ప్రాణాలను తీసేలా ఉండకూదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

childrens | telugu-news | parents

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment