Rape case: ఛీ ఛీ వీడేం వార్డెన్‌రా బాబూ.. అబ్బాయిలను రూమ్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి!

ఖమ్మం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్ వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బయటపడింది. రోజుకొక విద్యార్థిని రూమ్‌కు తీసుకెళ్లి కామావాంఛ తీర్చుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
kerala rape case

Khammam tribal school Warden sexually assaults students

Rape case: తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోని వార్డెన్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. రేలకాయలపల్లి వసతిగృహంలో వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు రోజుకొక విద్యార్థిని తన రూంలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి రూంకు రాకుంటే సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ టీసీ ఇప్పిస్తానని బెదిరిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. 

విషయం బయటకి చెబితే టీసీ ఇస్తా.. 

వార్డెన్ వెంకటేశ్వర్లు లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం బయటకి చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానంటూ భయపెడుతున్నాడు. వార్డెన్ వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన కారేపల్లి పోలీసులు వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన కారణంగా ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ , ఐటీడీఏ అధికారి జహీరుద్దీన్ ను ఈ కేసులో చేర్చారు. బాధిత విద్యార్థులను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ఇది కూడా చదవండి: charmi : ఛార్మిని అలా చూపించి తప్పు చేశా..  క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

చదువు చెప్పాల్సిన గురువు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విజయవాడలోొ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోర్టు ఆ ఉపాధ్యాయుడికి పదేళ్ల శిక్ష విధించింది. అలాగే రూ.10 వేలు జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.3 లక్షలు అందజేయాలని కోర్టు ఆదేశించింది.

New Update
8 Arrested For Raping 13-Year-Old Sikkim Girl For Months

Vijayawada

చదువు చెప్పాల్సిన గురువే ఓ విద్యార్థిని పాలిట శాపం అయ్యాడు. నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భవానీపురం జోజినగర్‌కు చెందిన పుల్లేటికుర్తి భువనచంద్ర (31) తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ స్కూల్‌లో చదువుతున్న ఓ పదో తరగతి బాలిక స్పెషల్ క్లాస్‌కు వెళ్లింది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

రూ.3 లక్షలు నష్టపరిహారంగా..

దీంతో బాలిక భయపడి.. స్కూలు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ జరిమానాలో రూ.10 వేలు, నష్టపరిహారం కింద రూ.3 లక్షలు బాధితురాలికి అందజేయాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌సెల్‌ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

ఇదిలా ఉండగా.. మైనర్ బాలిక గర్భం దాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. అయితే బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ కేసులో యువకుడికి బెయిల్ మంజూరు  చేసింది న్యాయస్థానం. ఈ ఘటన 2020లో జరగగా తాజాగా కేసు విచారించిన ముంబై హైకోర్టు.. కీలక తీర్పు వెల్లడించింది. నవీ ముంబైకి చెందిన మైనర్ బాలిక 2020లో యూపీ యువకుడితో లేచిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో తిరిగి ఇంటికి వచ్చింది.

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

విషయం గమనించిన మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.  ఈ కేసును సోమవారం విచారించిన న్యాయస్థానం..'బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరిగిందో ఆమెకు తెలుసు. కాబట్టి ఈ కేసులో అతినికి బెయిల్ మంజూరు చేయాల్సిందే' అని స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

 

 

Advertisment
Advertisment
Advertisment