Hyd Old city: తాహనజర్ హత్యకు అదే కారణమా? పోలీసుల విచారణలో సంచలనాలు!

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన తాహనజర్ సూసైడ్ కేసు ఉత్కంఠ రేపుతోంది. దబీర్ పూర్ ఫ్లై ఓవర్‌పై నుంచి దూకడానికి బలమైన కారణమే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల లేదా ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

New Update

Hyd Old city: జీవితం ఎంతో విలువైంది. కానీ కొంతమంది చిన్న విషయానికే ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉసురు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపై వివాహిత బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. ఆమెకు వచ్చింది ఎంత పెద్ద కష్టమో తెలీదు కానీ.. ఆమె నిర్ణయం మాత్రం ఒక జీవితాన్ని బలి తీసుకుంది.

మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. పాతబస్తీకి చెందిన తాహనజర్.. దబీర్ పూర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకింది. 50 అడుగుల ఎత్తు నుంచి కింద రోడ్డుపైకి దూకటంతో స్పాట్ లోనే చనిపోయింది ఆ వివాహిత. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

తాహనజర్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ మృతికి కుటుంబ కలహాలేమైన కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మహిళలు ఇంట్లోనే బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ తాహనజర్ తెల్లవారుజామున నడిరోడ్డుపైకి వచ్చి ప్రాణాలు తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

 hyderabad | old-city | sucide | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చరియలు..ఆరుగురు మృతి

కొండచరియలు, చెట్లు విరిగి వాహనాలపై పడడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

New Update
Himachal Pradesh landslide

Himachal Pradesh landslide

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లోనీ కులు లో  కొండ చరియలు విరిగి పడి ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌ కులులోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ఎదురుగా ఉన్న పిడబ్ల్యుడి రోడ్డు సమీపంలో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన ఆరుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు.

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

కొండచరియలు, చెట్లు విరిగి వాహనాలపై పడడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద కొందరు స్థానికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్కూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల గుర్తింపు వివరాలపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొన్నారు. వీరిని పర్యాటకులుగా గుర్తించినట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

  కులులోని ADM అశ్వనీ కుమార్ ప్రకారం, ఈ సంఘటనపై పోలీసులు,జిల్లా పరిపాలన సహాయక బృందాలు వెంటనే స్పందించాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జారిలోని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం, మృతుల్లో రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యాపారి, ఒక కారు రైడర్ మరియు అక్కడికక్కడే ఉన్న ముగ్గురు పర్యాటకులు ఉన్నారు. జారి నుండి అగ్నిమాపక శాఖ బృందం కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంటోంది. మృతుల గుర్తింపులను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Advertisment
Advertisment
Advertisment