Hyderabad Murder News: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తులతో దాడి!

హైదరాబాద్‌లో పట్టపగలే ఘోరం జరిగింది. మెట్టుగూడలో బైక్‌పై వెళ్తున్న తల్లీ కొడుకు రేణుక, యశ్వంత్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

author-image
By srinivas
New Update
murder hyd

Hyderabad Mettuguda Murder attempt case

Hyderabad Murder News: హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే దారుణం జరిగింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కొంతమంది దుండగులు తల్లీ, కొడుకుపై దారుణానికి పాల్పడ్డారు. పాత పగల నేపథ్యంలో కత్తులతో వెంటపడి పరిగెత్తించి దాడిచేశారు. ఈ ఘటన మెట్టుగూడలో చోటుచేసుకోగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. అక్కడున్నవారంతా పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..

Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

ముసుగు ధరించి అటాక్..

ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మెట్టుగూడలో బైకుపై వెళ్తున్న తల్లీ రేణుక, కొడుకు యశ్వంత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అయితే దాడి చేసే సమయంలో దుండగులు ముసుగు ధరించి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కత్తి గాయాలైన ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా యశ్వంత్, రేణుక పిరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యశ్వంత్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. 

Also Read: Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై బలవన్మరణం.. డిపార్ట్‌మెంట్‌లో కలకలం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ

పహల్గాం ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీకి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. యూఏఈలో ఉంటున్న నీరజ్ ఇండియా వచ్చి వెకేషన్ కోసం భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోకి పహల్గాం వెళ్లగా ఉగ్రదాడి జరిగింది.

New Update
Jaipur udwani

Jaipur udwani

జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారు. ఈ ఉగ్రదాడిలో ఎన్నో అందమైన జంటలు బలి అయ్యాయి. కొత్త పెళ్లయిన జంటలు తన భాగస్వామితో వెకేషన్‌కి వెళ్లగా.. దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీ అనే వ్యక్తికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

వివాహం కోసం ఇండియాకి రాగా..

యూఏఈలో ఉంటున్న నీరజ్ ఓ వివాహం ఉందని ఇండియాకి వచ్చారు. ఈ క్రమంలో భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోకి పహల్గాం వెళ్లగా.. ఉగ్రదాడికి పాల్పడ్డారు. అయితే నీరజ్ చిన్నతనంలో తండ్రి మృతి చెందగా.. తల్లి కష్టపడి చదివించింది. ఇప్పుడు నీరజ్ కూడా చనిపోవడంతో తల్లి, భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment