Ganja: మీడియా వెహికల్‌లో గంజాయి రవాణా.. 5వసారి అడ్డంగా బుక్కయ్యారు

గంజాయి వ్యాపారంలో స్మగ్లర్లు ఆరితేరారు. తమిళనాడుకు చెందిన కియా కారుకు ప్రముఖ తెలుగు మీడియా స్టిక్కర్, ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ అతికించి తరలిస్తుండగా నర్సీపట్నం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ కారులో నాలుగుసార్లు రవాణా చేసినట్లు గుర్తించారు. 

New Update
ganja

ganja Photograph: (ganja )

Ganja: గంజాయి రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ గంజాయి స్మగ్లర్లు కొత్త పద్ధతిలో దందా నడిపిస్తున్నారు. ఈసారి ఏకంగా మీడియా వెహికిల్ ముసుగులో రవాణా మొదలుపెట్టారు. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరుసగా నాలుగు సార్లు మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేశారు. అయితే ఐదోసారి మాత్రం ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు.

 10 రోజులు పాటు బుక్ చేసుకుని.. 

ఈ మేరకు తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై ప్రముఖ మీడియా సంస్థ లోగోను అద్దాలపై అతికించారు. కార్లు అద్దెకి ఇచ్చే టూరిస్ట్ యాప్‌లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారును 10 రోజులు పాటు బుక్ చేసుకుని దానికి ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ బోర్డును అతికించారు. అల్లూరి జిల్లా అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 10 లక్షలు విలువ చేసే 205 కేజీలు గంజాయి కొనుగోలు చేశారు. అనతరం అల్లూరు జిల్లా మీదుగా నర్సీపట్నం వైపు వెళ్తున్నారు.

ఇది కూడా చదవండి: ICC AWARDS 2024: టెస్టుల్లో ఈ ఇద్దరికే.. వన్డేల్లో ఒక్కరు లేరు!

అయితే కారు నర్సీపట్నం శివారు నెల్లిమెట్ట గ్రామానికి చేరుకోగానే పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను, మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని పట్టుకున్నారు. గంజాయి ప్యాకెట్లతో నిండిన కియా కార్‌తో పాటు ఒక మోటార్ బైక్ సెల్ ఫోన్ 1500 డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను స్టేషన్ కు తరలించగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులను అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.

ఇది కూడా చదవండి: Kodali Nani: పాలిటిక్స్ కు గుడ్ బై... 25న వైసీపీకి రాజీనామా.. కొడాలి నాని సంచలన ప్రకటన?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment