Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో ఓ లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్ దొరికాయి. అమన్‌దీప్ కౌర్‌ ప్రయాణిస్తున్న కారులో 17.71 గ్రాముల హెరాయిన్‌‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపబడింది. ఉన్నతాధికారులు ఆమెను అరెస్ట్ చేసి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.

New Update
women constable drugs

women constable drugs Photograph: (women constable drugs)

Drugs: రూల్స్ సామాన్యులకేనా.. పోలీసులకు వర్తించవన్నట్లుగా ఓ లేడీ కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. డ్రగ్స్ నిర్మూలించాల్సిన పోలీసులే యథ్దేచ్చగా వారి వాహనాల్లో డ్రగ్స్ తరలిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని బటిండాలో చోటుచేసుకుంది. చెకింగ్ పాయింట్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కారును ఆపి చూసిన పోలీసులు కంగుతిన్నారు. ఆ రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్‌ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ తన వాహనంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందింది.

Also read: Congress MLA CPR: కాంగ్రెస్ కార్యకర్తకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే (VIDEO)

Also read: urine: నా మూత్రం తాగడం వల్లే నేను ఆరోగ్యంగా ఉంటున్నా.. ఎలాగంటే?

Also read: Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ

గేర్‌ బాక్స్‌ వద్ద దాచిన హెరాయిన్‌..

పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి కౌర్‌ డ్రైవ్‌ చేస్తున్న వాహనాన్ని భటిండాలోని బాదల్ ఫ్లైఓవర్ సమీపంలో అడ్డగించారు. తనిఖీ చేయగా గేర్‌ బాక్స్‌ వద్ద దాచిన 17.71 గ్రాముల హెరాయిన్‌ లభించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళా కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే నిబంధనల ప్రకారం పోలీస్‌ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. అమన్‌దీప్ కౌర్‌కు మహేంద్ర థార్‌తోపాటు ఆడి, 2 ఇన్నోవా కార్లు, బుల్లెట్ బైక్‌, 2 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఖరీదైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తోందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం అడగడంతో పాటు మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు.

New Update
PahalgamTerroristAttack

PahalgamTerroristAttack

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్‌కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఇద్దరు తెలుగు వాసులు

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్‌ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ అనే తెలుగు వ్యక్తి కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్‌ బెంగూళురులో స్థిరపడినట్లు తెలుస్తుంది.కుటుంబంతో కలిసి ఆయన కశ్మీర్‌యాత్రకు వెళ్లారు.ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్‌ రంజన్‌ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

Advertisment
Advertisment
Advertisment