తల్లే విలన్.. ప్రియుడి కోసం పిల్లలకు పెరుగులో విషం.. బయటపడ్డ మహిళ బాగోతం!

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది.  ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత.

author-image
By Krishna
New Update
women-kids

women-kids

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకున్న ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.  ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది. భర్తను కూడా హత్య చేయాలనుకుంది ఈ ఘాతకురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  వాటర్ ట్యాంకర్ డ్రైవర్‎గా పనిచేస్తోన్న చెన్నయ్య (40), లావణ్య (38) దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. లావణ్య  ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఇటీవల జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీలో పాత స్నేహితుడితో లావణ్యకు కనెక్షన్ కుదిరింది.  

Also read : KPHB : భర్త, మరిది టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్!

Also read : జర్మనీ యువతిపై క్యాబ్ డ్రైవర్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్- జరిగిందిదే!

వివాహేతర సంబంధానికి దారి

ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.  దీంతో అతడితో కలిసి ఉండాలని లావణ్య స్కెచ్ వేసింది. భర్త,పిల్లల్ని చంపేసి లవర్ తో  ఎంజాయ్ చేయాలని అనుకుంది. ప్లాన్ లో భాగంగా మార్చి 27 రాత్రి అందరూ కలిసి పప్పు, పెరుగుతో భోజనం చేశారు. అయితే రజిత పిల్లలకు పెరుగులో విషం కలిపింది. భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిని పనికోసం బయటకు వెళ్లాడు.  రాత్రి 11 గంటలకు చెన్నయ్య వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగా ఉందంటూ నాటకం ఆడింది రజిత. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే హంతకురాలిని తేల్చారు. రజిత ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Also read :  వాళ్లు విడాకులు తీసుకుంటే నన్నేందుకు లాగుతున్నారు : దివ్యభారతి

Also read :  Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్‌ కోస్టర్‌ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!

ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్‌ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. సరదాగా తిరిగొద్దామని కాప్‌సహేడా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ ఎక్కారు. దాని స్టాండ్ విరగడంతో ఆమె కిందపడి మరణించింది.

New Update
Delhi woman dies after falling from Roller Coaster

Delhi woman dies after falling from Roller Coaster

నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నుండి కింద పడి 24 ఏళ్ల ప్రియాంక మృతి చెందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

ఏం జరిగిందంటే?

నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంకతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. అక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో గురువారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అదే సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగి ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో మృతిచెందిన మృతురాలు ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ENT రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద పంక్చర్ గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!

కాగా చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రియాంకకు ఫిబ్రవరి 2026లో వివాహం జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కూల్‌ డ్రింక్స్‌ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!

(crime news | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment