Rape case: మైనర్ బాలికను రేప్ చేసిన బ్యాడ్మింటన్ కోచ్.. ఫోన్‌లో ట్రైనీల న్యూడ్ ఫొటోలు!

బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించిన పోలీసులు తమిళనాడుకు చెందిన సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

New Update
rape case bg

Bengaluru Badminton coach sexually assaults minor girl

Rape case: బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై  బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించి పోలీసులు సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

ట్రైనీల న్యూడ్ ఫొటోలు..

ఈ మేరకు తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్ లో బాడ్మింటన్ కోచ్ గా పనిచేస్తున్నాడు. అయితే 16 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం ట్రైనీగా చేరింది. ఆమెను బలవంతంగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో మరో 8మంది ట్రైనీల న్యూడ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బాలికతోపాటు మరికొంతమంది అమ్మాయిలను కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుండటం సంచలనం రేపుతోంది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అయితే బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కోచ్ తరచుగా బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బయటపడింది. కోచ్‌ సురేష్‌తో చేసిన చాటింగ్‌లో బాలిక తన న్యూడ్‌ పిక్స్‌ను అతనికి పంపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను నిలదియగా అసలు విషయం బయటపెట్టింది. కానీ బాలిక మాత్రం కోచ్‌ సురేష్‌తో తానే అక్రమం సంబంధం పెట్టుకున్నట్లు చెప్పడంతో కేసు మరింత సంచలనంగా మారింది.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

bengalore | rape-case | minor-girl | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

New Update
HP accident

HP accident

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

తమ్ముడి వివాహం అయిపోయాక 

మృతులను చాచియోట్ తహసీల్‌లోని తరౌర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ కుమారుడు దునిచంద్ (33), తరౌర్ గ్రామానికి చెందిన దునిచంద్ భార్య కాంతా దేవి (28), వారి కుమార్తె కింజల్ (8 నెలలు), చాచియోట్ తహసీల్‌లోని నౌన్ గ్రామానికి చెందిన థాలియా రామ్ కుమారుడు దహ్లు రామ్ (52), నేపాల్ నివాసి మీనా దేవి (30)గా గుర్తించారు. దునిచాంద్ తమ్ముడి వివాహం అయిపోయిన తరువాత కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పాండో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం, SDRF, CISF, పాండో అవుట్‌పోస్ట్ బృందాలు మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి

Advertisment
Advertisment
Advertisment