ఫస్ట్ నైట్ రోజే లేపేశాడు.. బెడ్రూమ్ లోకి వెళ్లాక..!

ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు.  వధువు మంచంపై పడిపోయి ఉండగా..  వరుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
marriage bride and groom

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ్ నగరంలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు.  వధువు శివాని మంచంపై పడిపోయి ఉండగా..  వరుడు ప్రదీప్  సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపి, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. అయోధ్య జిల్లాలోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహదత్‌గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

పెళ్లాయ్యాక రాత్రి పడుకునేందుకు గదిలోకి వెళ్లిన నవదంపతులు ఇద్దరూ మరుసటి రోజూ ఎంతకు బయటకు రాలేదు.  పదే పదే ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో డోర్ పగలుకొట్టి చూడగా ఇద్దరు చనిపోయి కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. 

Also read :  చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!

ఇద్దరి అంగీకారంతో పెళ్లి ఫిక్స్

ఈ ఘటనపై వరుడి అన్నయ్య దీపక్ కుమార్ మాట్లాడుతూ..  పెళ్లి సమయంలో అంతా సజావుగా జరిగిందని, ఆ జంట కుటుంబంతో కలిసి భోజనం కూడా చేశారని అన్నారు. అయితే రాత్రి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదని వాపోయాడు.  ఇద్దరి అంగీకారంతో ఆరు నెలల క్రితం పెళ్లి ఫిక్స్ చేశామని తెలిపాడు. అయితే ఈ సంఘటన ఆత్మహత్య కేసుగా కనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు.

 గదిలో విషపు సీసాగానీ, మరే ఇతర అనుమానాస్పద వస్తువుగానీ కనిపించలేదు. అయితే వధువు మెడపై గుర్తులు కనిపించాయి.  వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వారిద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కాల్ వివరాలను పరిశీలిస్తున్నారు.  ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో పెళ్లి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.  

Also read :  తండ్రీ కొడుకులకు బలుపు తప్పా ఏముంది..రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tamil Nadu : పట్టుకున్న చేపే ప్రాణాలు తీసింది...తమిళనాడులో దారుణం!

బతికి ఉన్న చేపను నోటిలో పెట్టుకుని అది లోపలకి జారిపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అతన్ని వెంటనే ఆసుపత్రిగా తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడిని అరయపక్కం గ్రామానికి చెందిన మణిగందన్ గా గుర్తించారు.

New Update
fish tamil nadu

fish tamil nadu

బతికి ఉన్న చేపను నోటిలో పెట్టుకుని అది లోపలకి జారిపోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.  చెంగల్పట్టు జిల్లాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి మంగళవారం మధురాంతకం ప్రాంతం సమీపంలో చేపలు పడుతుండగా బతికి ఉన్న చేపను నోటిలో పెట్టుకోవడంతో అది నోటీలోకి వెళ్లింది. దీంతో ఊపిరాడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.  మృతుడిని అరయపక్కం గ్రామానికి చెందిన మణిగందన్ గా గుర్తించారు. స్థానికంగా రోజువారీ కూలీగా పనిచేసే అతనికి చేతులతో చేపలు పట్టే అలవాటు ఉంది.  

Also read :  Love jihad : లవ్ జిహాద్.. బయటకు ఈడ్చుకొచ్చి ఊతికారేసిన బీజేపీ మహిళా లీడర్!

తప్పించుకోకుండా ఉండటానికి

అతను చేపల కోసం తక్కువ నీటి మట్టాలు ఉన్న కీళవలం సరస్సు వద్దకు మంగళవారం వెళ్ళాడు. అయితే ముందుగా మణిగందన్ ఒక చేపను పట్టుకున్నాడు. అయితే మరొక చేపను చూసిన మణిగందన్‌ అది తప్పించుకోకుండా ఉండటానికి మొదటిదాన్ని తన నోటిలో పెట్టుకున్నాడు. అయితే బతికి ఉన్న ఆ చేప అతని గొంతులోకి లోతుగా వెళ్లిపోయింది.  అతని చుట్టూ ఉన్నవారు  వెంటనే మణిగందన్‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే మణిగందన్‌ మృతి చెందినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. మణిగందన్‌ మృతదేహాన్ని కాయంకుళం తాలూకా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.

Also read : Uttar Pradesh : భార్యకు దగ్గరుండి ప్రియుడికిచ్చి రెండో పెళ్లి చేసిన భర్త!

 

Advertisment
Advertisment
Advertisment