MBBS Student: కాకినాడ జిల్లాలో విషాదం.. ప్రాణాలు తీసుకున్న ఎంబీబీఎస్ విద్యార్థి

కాకినాడ జిల్లాలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Kakinada

Kakinada Photograph: (Kakinada)

ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా (Kakinada District) లోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ ( ) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు గదిలోపలికి వెళ్లి ఎంత సమయమైన బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు.

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

కొడుకు మరణంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

హాస్టల్ సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోషించాల్సిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?

ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ చూడొద్దమ్మ అని తల్లి మందలించినందుకు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుమురం భీం జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. అయితే కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం నవోదయ ప్రవేశపరీక్షకు హాజరైంది. అనంతరం ఇంటికి వచ్చి స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ జిరాక్స్ తీసుకుంటానని మొబైల్ అడిగింది. తల్లి తానే జిరాక్స్ తీసుకొస్తానని చెప్పడంతో ఆత్మహత్య చేసుకుంది.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment