చదువుకుంటుండగా.. 10తరగతి బాలిక ప్రాణం తీసిన కోతి

మేడపై చదువుతున్న పదవ తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది. బీహార్‌లోని సివాన్‌ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

New Update
girl killed

girl killed Photograph: (girl killed)

మేడపై చదువుతున్న పదవ తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా ఆ విద్యార్థిని అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్‌లోని సివాన్‌ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ప్రియా ఒంటరిగా ఇంటి మేడపై చదువుకొంటున్నది. కోతుల సమూహం ఇంటి మేడపైకి వచ్చాయి.

ఇది కూడా చదవండి : సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసుపై RGV సంచలన ట్వీట్!

ప్రియ చుట్టూ చేరి.. కోతులు బాలికపై దాడి చేశాయి. భయంతో ప్రియా ఆ కోతుల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అందులో ఓ కోతి ప్రియ మీదికి దూకి మిద్దెపై నుంచి తోసేసింది. దీంతో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రియా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కోతి తోసేయడంతో మరణించిన ప్రియా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఆమె ఫ్యామిలీ నిరాకరించిందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment