BREAKING: కూలిన కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్‌.. నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కోల్ట్‌ స్టోరేజ్ బిల్డింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
4 killed as cold storage facility collapses in Uttar pradesh

4 killed as cold storage facility collapses in Uttar pradesh

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కోల్ట్‌ స్టోరేజ్ బిల్డింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద కొందరు కార్మికులు చిక్కుకుపోగా.. పోలీసులు, అగ్నిమాపక దళం, NDRF, SDRF టీమ్‌లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అలాగే ఆ బిల్డింగ్‌ నుంచి బయటికొచ్చిన అమ్మోనియా గ్యాస్ లీకేజీని కూడా అరికట్టాయి.    

Also Read: ఆలయంలో అమానుష ఘటన.. భక్తులను ఈడ్చుకెళ్లి కొట్టిన పూజారులు

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అన్సార్ అహ్మద్‌కు చెందిన కోల్డ్‌ స్టోరేజ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డవాళ్లకు రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు.  

Also Read: 23వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కు భారీ నష్టం..

Advertisment
తాజా కథనాలు