Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు

నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వలన దంతక్షయం, దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు

Lemon: చాలా మంది అందం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు నిమ్మకాయలను ఉపయోగిస్తున్నారు. నిమ్మకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కొన్ని నష్టాలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి . ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయ ఉపయోగాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జీర్ణక్రియకు మంచిది:

  • నిమ్మకాయలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ శరీరంలోని అసిడిటీ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా నిమ్మకాయ పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌ సీ కారణంగా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

    నిమ్మకాయ వల్ల నష్టాలు:

  • నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది. ఇంకా దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. దంతాలకే కాదు నిమ్మకాయల వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఎసిడిటీ ఉంటే నిమ్మకాయ తినడం వల్ల ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుంది. నిమ్మకాయలో పొటాషియం ఎక్కువగా ఉండటం కారణంగా హార్ట్‌ బీట్‌ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అందం విషయం:

  • మొటిమలను పోగొట్టడానికి, చుండ్రును వదిలించుకోవడానికి చాలా మంది నిమ్మకాయను ముఖం, తలకు అప్లై చేస్తారు. అయితే నిమ్మకాయను ఎక్కువగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. దురద, మంట వంటి చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే నిమ్మకాయను నేరుగా ముఖానికి రాసుకోకూడదని వైద్యులు అంటున్నారు. అదేవిధంగా బరువు తగ్గేందుకు కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతుంటారు. దీని వల్ల చర్మం చాలా పొడిగా మారుతుంది. అలాగే ఎసిడిటీ వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి అలవాట్లను తగ్గించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

నిమ్మకాయను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు:

  • నిమ్మరసాన్ని ముఖానికి రాసుకునేటప్పుడు అందులో తేమ శాతం ఉన్న మరికొన్ని పదార్థాలను జోడించడం మంచిది. రెండు చుక్కల నిమ్మరసం, కలబంద జెల్ మిక్స్ చేసుకోవాలి. కలబంద చర్మం పొడిబారకుండా చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ పని చేసి చూడండి..ఆఫీస్‌ వర్క్‌ మెదడుపై ఒత్తిడి చూపదు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.

New Update
trump pehalgam

trump pehalgam

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read:Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

Also Read: J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.మరో వైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోడీ తన పర్యటనను కుదించుకున్నారు.

జెడ్డా నుంచి మంగళవారం రాత్రి భారత్‌కు ఆయన తిరుగుపయనమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని మినీ స్విట్జర్లాండ్‌ గా పేర్కొందిన పెహల్గాం సమీప బైసరన్‌ లోయలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పర్యటకులను చుట్టుముట్టి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా,వారిలో ఇద్దరు విదేశీయులను ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మృతుల్లో హైదరాబాద్‌ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీశ్‌ రంజన్‌ సైతం ఉన్నారు. 

Also Read: BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

J&K Terror Attack | Pahalgam attack | trump | modi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment