Lok Poll Survey: తెలంగాణలో ఆ పార్టీదే హవా అంటున్న లోక్ పోల్ సర్వే...రేవంత్ జిమ్మిక్కు అంటున్న దాసోజు

తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో సర్వేల సందడి మొదలైంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోనుంది? అంటూ సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో అన్నింటికంటే ఢిపరెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ దే హవా అంటూ లోక్ పోల్ సర్వే చెబుతోంది. అందరికన్నా భిన్నంగా ఉండడంతో దీని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

New Update
Lok Poll Survey: తెలంగాణలో ఆ పార్టీదే హవా అంటున్న లోక్ పోల్ సర్వే...రేవంత్ జిమ్మిక్కు అంటున్న దాసోజు

Lok Poll Survey - Telangana Elections: దేశం మొత్తం ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో కూడా హడావుడి మొదలైంది. రేపో మాపో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తుల ప్రారంభించేశాయి. బీఆర్ఎస్ (BRS) ఇప్పటికే అభ్యర్ధుల లిస్ట్ ను కూడా విడుదల చేసింది. మిగతా పార్టీలు తొందరలోనే చేస్తారు. ప్రచారాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. తెలంగాణలో ఈసారి కూడా తమదే అధికారం అని బీఆర్ఎస్ అంటోంది. హ్యాట్రిక్ కచ్చితంగా కొడతామని చెబుతోంది. కానీ కాంగ్రెస్ (Congress) , బీజెపీ (BJP) నేతలు ఎలా అయినా బీఆర్ఎస్‌ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు కూడా తమ పలితాలను వెల్లడిస్తున్నాయి. అందరూ మళ్ళీ తెలంగాణకే పట్టం కడుతుంటే లోక్ పోల్ సర్వే మాత్రం (Lok Poll Survey) కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. దీంతో ఈ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

లోక్ పోల్ సర్వేలో మాత్రం హస్తానిదే హవా నడుస్తుందని తేలింది. లోక్ పోల్ ప్రీపోల్ సర్వేలో అధికార బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 సీట్లు మాత్రమే వస్తాయని.. కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం 61 నుంచి 67 సీట్లు రానున్నట్టు చెబుతోంది. ఇక ఈసారి తెలంగాణలో తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తున్న బీజేపీ మాత్రం 2 నుంచి 3 సీట్లకే పరిమితం కానుందని లోక్ పోల్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇక ఏఐఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని.. ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశాలున్నట్టు పలితాల్లో తేలింది.

ఈ సర్వేలో సీట్ల విషయంలో బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ కు 15 సీట్లకు పైగానే వ్యత్యాసం కనిపిస్తోన్నా.. ఓటింగ్ విషయంలో మాత్రం పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 42 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్‌కు కూడా 41 నుంచి 44 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని సర్వే చెప్తోంది. ఇక 2 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుచుకునే బీజేపీ మాత్రం 10 నుంచి 12 శాతం ఓటింగ్ సంపాధించుకునే అవకాశం ఉంది. కాగా.. ఆరు నుంచి 8 సీట్లు గెలుచుకునే ఎంఐఎం పార్టీకి మాత్రం మూడు నుంచి 4 శాతం ఓటింగే వచ్చే అవకాశం ఉందని లోక్ పోల్ సర్వేలో తేలింది.

సీటుకు నోటు దొంగ...

లోక్ సోల్ సర్వే మీద బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇదంతా రేవంత్ (Revanth Reddy) సృష్టి అని విమర్శించారు. దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ కాతాలో పోస్ట్ చేశారు. ఓటుకు నోటు దొంగ ఇప్పుడు సీటుకు నోటు దొంగగా మారాడని...జాగ్రత్తగా ఉండాలని శ్రవణ్ తన పోస్ట్ లో రాశారు. సమర్ధులైన అభ్యర్ధులే లేరు కానీ మెజారిటీ సీట్లు గెలుస్తారని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు రేంటెంత రెడ్డి, కొనుగోలు సునీల్ అంటూ వెటకారం చేశారు.

Also Read: జ్యూస్ షాప్, టైర్ షాప్…మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.

New Update
trump pehalgam

trump pehalgam

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read:Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

Also Read: J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.మరో వైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోడీ తన పర్యటనను కుదించుకున్నారు.

జెడ్డా నుంచి మంగళవారం రాత్రి భారత్‌కు ఆయన తిరుగుపయనమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని మినీ స్విట్జర్లాండ్‌ గా పేర్కొందిన పెహల్గాం సమీప బైసరన్‌ లోయలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పర్యటకులను చుట్టుముట్టి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా,వారిలో ఇద్దరు విదేశీయులను ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మృతుల్లో హైదరాబాద్‌ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీశ్‌ రంజన్‌ సైతం ఉన్నారు. 

Also Read: BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

J&K Terror Attack | Pahalgam attack | trump | modi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment