CM Revanth : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ.. వారిపై వరాల జల్లు?

సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారితో సమావేశమై వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

New Update
CM Revanth : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ.. వారిపై వరాల జల్లు?

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్(Hyderabad) లోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ సమావేశం జరగనుంది. వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కలిపించడంతో తమకు ఆర్థికంగా నష్టం చేకూరుతుందని ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వారితో భేటీ అయ్యి.. వారి అభిప్రాయాలను, ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. వారికి సీఎం రేవంత్ పలు హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు!

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు…

ఇదిలా ఉండగా కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి రూ.12000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పోందుపర్చింది. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధివిధానాలు రూపొందించాలంటుంది ప్రభుత్వం. ఎవరెవరికి ఈ స్కీమ్‌ వర్తించాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లుకు ఇవ్వాలా.. ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆటోలను అద్దెకు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లకు ఇస్తే ఆటో కొన్న తమ పరిస్థితి ఏంటని ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ముందుగా దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్‌ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ:  రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS jagan: జగన్ పర్యటనలో భద్రతా లోపం.. హెలికాప్టర్‌ అద్దాలు ధ్వంసం

వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. రాప్తాడుకి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన్ని చూడ్డానికి జనం భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు పోలీసులను దాటుకొని హెలికాఫ్టర్ దగ్గరకు దూసుకొచ్చారు. జనం తాకిడికి హెలికాఫ్టర్ అద్దాలు పగిలిపోయాయి.

New Update
YS jagan helicoptor

YS jagan helicoptor Photograph: (YS jagan helicoptor)

వైసీపీ నేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న జగన్‌ను చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు హెలికాఫ్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసు సిబ్బంది నియంత్రించలేక పోయ్యారు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ (అద్దాలు) ధ్వంసమైయ్యాయి. భద్రతా కారణాల రీత్యా వీఐపీని అలాంటి పరిస్థితిలో హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.

హెలికాప్టర్‌ దగ్గర క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి సరిపడా సెక్యూరిటీ పెట్టలేదని పోలీసు వ్యవస్థపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ హత్యకు కుట్ర చేశారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం పైలెట్ల సూచనతో రోడ్డు మార్గంలో జగన్‌ బెంగళూరుకు బయలుదేరారు.

Advertisment
Advertisment
Advertisment