National: ఎన్నికల ముందే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి..

పార్లమెంటులో ఆమోదం పొందిన ఐదేళ్ళకు పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రం. CAA ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి హింసించబడిన వలసదారులకు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వాన్ని అందిస్తుంది

New Update
National: ఎన్నికల ముందే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి..

Citizenship Amendment Act: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019 అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019 డిసెంబర్‌లో ఆమోదం పొందింది. అప్పుడే దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ సీఏఏ చట్టానికి సంబంధించి పూర్తి నిబంధనలు రూపొందిచకపోవడంతో అమల్లోకి తీసుకురాలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల కంటే ముందే దీన్ని అమల్లోకి తీసుకు వస్తామని కేంద్ర ప్రుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇప్పుడు దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

సీఏఏ చట్టం అక్రమ వలసలను ప్రోత్సహించదని కేంద్ర స్పష్టం చేసింది. సీఏఏ డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు దేశంలోకి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, జైన్, పార్శీ మతాల వారికి పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రత్యేక చట్టం. భారత రాజ్యాంగంలోని 245(1) అధికరణం కింద దేశం మొత్తానికి లేదా దేశంలోని ఏదైనా కొంత ప్రతాంతానికి సంబంధించి చట్టం చేసేందుకు పార్లమెంటుకు అధికారం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. సీఏఏ గురించి ముస్లిం సోద‌రుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, వాళ్ల‌ను రెచ్చ‌గొట్టార‌ని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. వేధింపులు త‌ట్టుకోలేక జీవ‌నోపాధి కోసం పాక్‌, ఆఫ్ఘ‌న్‌, బంగ్లా నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారికి పౌర‌సత్వాన్ని ఇస్తామని ఆయన తెలిపారు. ఎవ‌రి భార‌తీయ పౌర‌స‌త్వాన్ని లాక్కోవ‌డం ఆ చ‌ట్టం ఉద్దేశం కాదని అమిత్ షా అన్నారు.

ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు కూడా రాజ్యాంగ ల‌క్ష్య‌మ‌న్నారు. దేశ తొలి ప్ర‌ధాని నెహ్రూ ఆ పౌర స్మృతి బిల్లు గురించి చ‌ర్చించార‌న్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మ‌డి పౌర స్మృతిని విస్మ‌రించింద‌న్నారు. ఉత్త‌రాఖండ్‌లో యూసీసీ అమ‌లు చేయ‌డం సామాజిక మార్పు అన్నారు. సెక్యుల‌ర్ దేశంలో మ‌త‌ప‌ర‌మైన పౌర‌స్మృతులు ఉండ‌వ‌న్నారు. ఇప్పుడు చట్టం అమలుతో అన్ని ఇబ్బందులు తొలగిపోయాని స్పష్టం చేశారు.

Also Read:Movies: అవంటే ఇష్టం కానీ ఎవరూ ఆఫర్ చేయడం లేదు-నీహారిక

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment