Trisha: పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కన్నాను.. త్రిష సంచలన కామెంట్స్

చిత్రా లక్ష్మణన్ అనే నటుడు ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ త్రిష సినిమాలు మానేస్తున్నారని చెప్పారు. ఇది వైరల్ అవ్వడంతో త్రిష తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తన ఇన్‌స్టా స్టోరీలో దీనిపై స్పందించారు.

New Update
Trisha Breaks Silence On movies Retirement Rumors

Trisha Breaks Silence On movies Retirement Rumors

టీవీకే అధినేత విజయ్‌, నటి త్రిష రిలేషన్‌లో ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిత్రా లక్ష్మణన్ అనే నటుడు ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ త్రిష సినిమాలు మానేస్తున్నారని చెప్పారు. ఇది వైరల్ అవ్వడంతో త్రిష తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తన ఇన్‌స్టా స్టోరీలో దీనిపై స్పందించారు. '' అవును నేను సినిమాలు మానేశాను. ఓ పెద్ద వ్యాపారవేత్తను వివాహం చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాను. ఇది మీ ఊహాగానాలకు సరిపోతుందా ?. మీకు వార్తలు రాసుకునేందుకు ఇది చాలా ఇంకే ఏమైనా చెప్పాలా'' అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. 

Also Read: పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టం.. తొలి 'క్వీర్' ఎంపీగా మేనకా గురుస్వామి ప్రమాణస్వీకారం

త్రిష ఈ కామెంట్స్‌ చేయడంతో ఆమె సినిమాలు చేయడం మానేయనున్నారన్న వార్తలకు చెక్ పడింది. అయితే ఓ యూట్యూబ్‌ వేదికగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు చిత్రా లక్ష్మణన్ మాట్లాడారు. త్రిష ఇకనుంచి సినిమాల్లో చేయాలని అనుకోవడం లేదని.. వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదని తెలిపారు. 

Also Read: పో*ర్న్‌ సైట్‌లో నా ఫొటో పెట్టారు.. జాన్వీ కపూర్ ఎమోషనల్

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్రిష రాజకీయాలపై ఫోకస్ పెట్టారనే వార్తలు కూడా వచ్చాయి. విజయ్‌కి, ఆమెకి రిలేషన్ అల్లుతూ మరిన్ని ఊహాగాణాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీటన్నింటికీ చెక్‌ పెడుతూ త్రిష తనదైన స్టైల్‌లో స్పందించారు. ప్రస్తుతం ఆమె సూర్య నటిస్తున్న కరుప్పు (తెలుగులో వీరభద్రుడు), అలాగే చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు