Mohan babu : మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోహన్‌ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ  అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

New Update
mohan babu

mohan babu

జర్నలిస్టుపై దాడి కేసులో టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరో మోహన్‌ బాబు (Mohan Babu) కు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. మోహన్‌ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ  అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2024 డిసెంబరు 10వ తేదీన జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి దిగారు. ఈ  క్రమంలో ఆయనపై కేసు నమోదయింది. ముందుగా ఈ ఘటనలో మోహన్‌ బాబుపై బీఎన్‌ఎస్‌ 118(1) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తరువాత లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుని 109 సెక్షన్‌ కింద కేసు రిజిస్టర్‌ చేసి హత్యాయత్నం కేసుగా మార్చారు.

Also read :  బిగ్ షాక్.. మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ.. ఎక్కడో తెలుసా!

Also Read :  ఏపీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సిట్.. కీలక ఆధారాలు లభ్యం

హైకోర్టు రిజెక్ట్ 

అయితే మోహన్ బాబు తనపై నమోదైన  ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ  2024 డిసెంబరు 23న  హైకోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  తాజాగా  సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా..  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కాగా గాయపడిన  జర్నలిస్టుకు మోహన్‌ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన  ఓ లేఖ కూడా రిలీజ్ చేశారు. జర్నలిస్ట్‌ సోదరుడు గాయపడటం తనకు బాధ కలిగించిందన్న మోహన్ బాబు..   ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు. ఆ రోజు తన  ఇంటిగేటు విగిరిపోయిందని దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని తెలిపారు.  ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లుగా లేఖలో వివరించారు.

Also read :  ముంబై ట్విన్ టన్నెల్స్ లో ఫ్రాడ్...మేఘా ఇంజనీరింగ్ మీద హైకోర్టులో పిటిషన్

Also Read :  బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bramhamudi serial appu లవర్ ని పరిచయం చేసిన 'బ్రహ్మముడి' అప్పు.. అతడెవరో తెలిస్తే షాక్!

బ్రహ్మముడి ఫేమ్ అప్పు అలియాస్ నైనిష రాయ్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అతడితో కలిసి కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ నా జీవితం, నా బలం, నా సర్వస్వం అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అప్పు

బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అప్పు

Bramhamudi serial appu బుల్లితెర నటి నైనిష తెలుగులో అనేక సీరియల్స్ లో నటించినప్పటికీ 'బ్రహ్మముడి' సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ అప్పు పాత్రలో టామ్ బాయ్ గా కనిపిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బెంగాలీ నుంచి వచ్చినా.. ఎంచక్క తెలుగులో మాట్లాడుతూ సందడి చేస్తుంది నైనిష. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. 

లవర్ ని పరిచయం చేసిన నైనిష 

లవర్ తో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలను చేస్తూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. నా జీవితం, నా సర్వస్వం, నా బలం, నా ఆనందం అని రాసుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్ గుండెలపై పడుకొని క్యూట్ గా ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ కపుల్, సూపర్ జోడీ, నైస్ అంటూ రిప్లై లు ఇస్తున్నారు. అలాగే అతడు ఎవరు? ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు. కానీ నైనిష మాత్రం వీటికి ఎక్కడ రిప్లై ఇవ్వలేదు. 

ఇక నైనీష కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో భాగ్య రేఖ, హాసంగీతం, శ్రీమంతుడు, ఇంటిగుట్టు, వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ నటిస్తోంది. ఈ సీరియల్ అప్పు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. మొదటగా టామ్ బాయ్ గెటప్ లో రౌడీలా కనిపించిన అప్పు.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఉన్న నైనిష బెంగాలీ సినిమాల్లో చైల్ ఆర్టిస్టుగా కూడా నటించింది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పింది నైనిష. 

latest-news | cinema-news | bramhamudi-serial 

 

Advertisment
Advertisment
Advertisment