Ravi Teja's Mass Jathara: రవితేజ "మాస్ జాతర"లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..!

మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం "మాస్ జాతర" కోసం "ఇడియట్" మూవీలోని ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

New Update
Ravi Teja's Mass Jathara

Ravi Teja's Mass Jathara

Ravi Teja's Mass Jathara: టాలీవుడ్ మాస్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో  మాస్ మహారాజా రవితేజ. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు ఉన్న రవితేజ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది అనే చెప్పాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అతి తక్కువ టైం లో సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడం రవితేజ స్టైల్. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకొని సినిమాలను చేస్తుంటారు రవితేజ అయితే ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా "మాస్ జాతర" సినిమా నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది.

Also Read:  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

రవితేజ హీరోగా నటిస్తున్న "మాస్ జాతర" సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా, వింటేజ్ రవితేజ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, ఈ సినిమా గురించి ఒక  క్రేజీ బజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న భీమ్స్ రవితేజ ఓల్డ్ మూవీలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ను "మాస్ జాతర" కోసం మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ రీమిక్స్..!

భీమ్స్ రవితేజతో కలిసి గతంలో ధమాకా, రావణాసుర వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ కి పని చేసారు. ఇక ఇప్పుడు, "మాస్ జాతర" సినిమాతో మరో సారి రవితేజ కెరీర్ లో బెస్ట్ మాస్ ఆల్బమ్ ఇవ్వబోతున్నారు. అయితే అందుకోసం రవితేజ మూవీస్ లో సూపర్ హిట్ గా నిలిచిన "ఇడియట్" సినిమా నుండి ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అప్పట్లో ఈ పాట యూత్ ను ఒక ఊపు ఊపింది, మళ్ళీ ఇన్నాళ్లకు ఈ పాటను రీమిక్స్ చేస్తే మరోసారి సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Also Read:  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Also Read: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment